News March 24, 2025

పార్లమెంటులో ‘ఛావా’ చూడనున్న మోదీ, కేంద్ర మంత్రులు!

image

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం ‘ఛావా’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాను త్వరలో పార్లమెంటులో ప్రదర్శిస్తారని తెలిసింది. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారని సమాచారం. నటుడు విక్కీ కౌశల్, క్యాస్ట్ అండ్ క్రూ వస్తారని తెలుస్తోంది. స్క్రీనింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News March 29, 2025

ఈ రాశుల వారికి రేపటి నుంచి పండగే!

image

చాలా మంది రాశి ఫలాలను నమ్ముతుంటారు. ఉగాది వచ్చిందంటే చాలు ఆ ఏడాది తమ రాశి ఫలం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. రేపటి నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభంకానుంది. దీంతో కొత్త పంచాంగం అందుబాటులోకి రానుంది. అయితే ఈ నూతన ఏడాది మిథునం, కర్కాటకం, తుల, కన్య రాశుల వారి ఫలితాలు అద్భుతంగా ఉండనున్నట్లు పురోహితులు చెబుతున్నారు. వీరికి కొత్త ఏడాది శుభ ఫలితాలే. ఇంతకీ మీది ఏ రాశి? COMMENT

News March 29, 2025

వృద్ధ దంపతుల ప్రాణాలు తీసిన సైబర్ నేరగాళ్లు

image

సైబర్ మోసగాళ్ల దోపిడీతో కర్ణాటకకు చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు వీరికి వీడియో కాల్ చేసి తాము ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులమని.. మీపై కేసులయ్యాయని బెదిరించారు. దీంతో భయపడిన దంపతులు తొలుత రూ.5లక్షలు చెల్లించారు. అక్కడితో ఆగకుండా తరచుగా బెదిరిస్తూ రూ.50 లక్షలు దోపిడీ చేశారు. దీంతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి సూసైడ్ లెటర్‌లో ఆత్మహత్య కారణాలు రాశారు.

News March 29, 2025

రేపు ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ?

image

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘UI’ మూవీ రేపు సా.4.30 గంటలకు జీకన్నడ ఛానల్‌లో ప్రసారం కానుంది. ఆ వెంటనే జీ5 OTTలో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ చిత్రాలు కూడా టీవీల్లో ప్రసారమైన కాసేపటికే జీ5లోకి వచ్చేశాయి. ఇదే ట్రెండ్‌ను యూఐ సినిమాకు కూడా ఓటీటీ సంస్థ కొనసాగించనుందని సమాచారం.

error: Content is protected !!