News March 24, 2025
నాడు మోదీ చెప్పారు.. నేడు అమరావతిలోనూ అదే దోపిడీ: YCP

AP: అమరావతిలో రూ.27,159 కోట్ల విలువైన కాంట్రాక్టులను 3.94-4.34% అధిక ధరకు సొంత మనుషులకు CBN కేటాయించారని YCP ఆరోపించింది. ‘పోలవరాన్ని చంద్రబాబు ATM మాదిరి వాడుకుంటున్నారని మోదీ ఏ క్షణాన అన్నారో కానీ నేడు అమరావతిలోనూ అదే జరుగుతోంది. అప్పు తెచ్చిన డబ్బంతా అమరావతిలో పోసి 59 ప్యాకేజీల పనులను తమవాళ్లకు ఇచ్చుకున్నారు. అందులో కమీషన్లు నొక్కుతూ చంద్రబాబు సంపన్నుడు అవుతున్నారు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News January 13, 2026
మేడారం మహాజాతర.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

TG: మేడారం భక్తుల కోసం ‘MyMedaram’ పేరిట వాట్సాప్ సేవలను మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. 7658912300 నంబర్కు మెసేజ్ చేస్తే రూట్ మ్యాప్లు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. తప్పిపోయిన వారి సమాచారం, ఫిర్యాదులు వంటి వివరాలు ఇందులో లభిస్తాయి. ఈ సేవలు వెబ్సైట్, మొబైల్ యాప్తో పాటు వాట్సాప్లోనూ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
News January 13, 2026
కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండవచ్చా?

నివాస గృహాలలో ఓ కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యం, ప్రశాంతత సొంతమవుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఈ నిర్మాణం గాలి ప్రవాహాన్ని మెరుగుపరచి, గదుల ఉష్ణోగ్రత క్రమబద్ధంగా ఉంచుతుంది. సరైన వెలుతురు ప్రసరిస్తుంది. తద్వారా దైవకళతో ఉట్టిపడుతుంది. ఇది పని పట్ల ఏకాగ్రతను పెంచుతుంది. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 13, 2026
చైనా మాంజాపై పోలీసు కమిషనర్కు HRC నోటీసులు

TG: గాలిపటాలు ఎగురవేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజా కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. తీవ్రంగా గాయపడి కొన్నిచోట్ల పిల్లల ప్రాణాలూ పోతున్నాయి. దీనిపై దాఖలైన ఫిర్యాదుతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సీరియస్గా స్పందించింది. HYD పోలీసు కమిషనర్ సజ్జనార్కు నోటీసులు జారీచేసింది. ఈ ఘటనలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అడ్వకేట్ రామారావు ఇమ్మానేని HRCలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.


