News March 24, 2025
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్

పీజీఆర్ఎస్ నమోదైన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ప్రజల నుంచి 170 అర్జీలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపి, పరిష్కరించకోవచ్చని తెలపారు.
Similar News
News October 30, 2025
జనగామ కలెక్టర్ను కలిసిన డీపీఓ

జనగామ జిల్లా పంచాయతీ అధికారిగా ఎ.నవీన్ గురువారం కలెక్టరేట్లోని డీపీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ అధికారులు, డీపీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు.
News October 30, 2025
మోంథా తెచ్చిన తంటా.. ప్రయాణం గందరగోళం

తెలంగాణ వైపు దిశ మార్చుకున్న మోంథా తుపాను హైదరాబాద్ ప్రయాణికులను గందరగోళంలోకి పడేసింది. తుఫాను కారణంగా పలు బస్సులు, రైళ్లు రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 2 రోజుల్లో రైల్వే అధికారులు 137 రైళ్లను రద్దు చేశారంటే మోంథా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్- ఖమ్మం- డోర్నకల్- మహబూబాబాద్ రూట్లో కురిసిన వర్షం వల్ల అనేక రైళ్లు రద్దయ్యాయి.
News October 30, 2025
కూతురు మృతి: అడుగడుగునా లంచం ఇవ్వలేక..

ఒక్కగానొక్క కూతురు(34) అనారోగ్యంతో చనిపోతే.. ఆ తర్వాత అడుగడుగునా లంచం ఇవ్వలేక ఆ తండ్రి కుంగిపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. BPCL మాజీ CFO శివకుమార్ కూతురు ఇటీవల మరణించారు. అయితే అంబులెన్స్ మొదలుకుని FIR, పోస్టుమార్టం రిపోర్టు, అంత్యక్రియలు, డెత్ సర్టిఫికెట్ వరకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను SMలో పోస్టు చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. సిస్టమ్లోని కరప్షన్పై నెటిజన్లు ఫైరవుతున్నారు.


