News March 24, 2025
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్

పీజీఆర్ఎస్ నమోదైన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ప్రజల నుంచి 170 అర్జీలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపి, పరిష్కరించకోవచ్చని తెలపారు.
Similar News
News September 14, 2025
MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడగింపు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 20 లోపు (ఫైన్ తో) అప్లై చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.
News September 14, 2025
గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై చర్చలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ని ప్రకటించకపోవడంతో క్యాడర్ కొంతమేర నిరాశకు గురైంది. నిన్న జరిగిన సభలో ఇన్ఛార్జ్ని ప్రకటిస్తారని శ్రేణులు భావించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం అన్నీ తానై పార్టీని చూసుకుంటున్న బాసు హనుమంతు నాయుడిని ఇన్ఛార్జ్గా నియమిస్తారని భావించినా నిరాశ ఎదురయింది.
News September 14, 2025
జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.