News March 24, 2025

ఎల్లనూరు మండలంలో 971 ఎకరాలలో పంట నష్టం

image

ఎల్లనూరు మండల వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా 971 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 215 మంది రైతులు సాగు చేసిన 971 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు.

Similar News

News August 12, 2025

అదృశ్యమైన బాలుడు సూసైడ్

image

మూడు రోజుల క్రితం <<17361238>>అదృశ్యమైన<<>> గుమ్మగట్ట మండలం శిరిగేదొడ్డికి చెందిన కైలాస్ అనే 17 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం సమీపంలో విప్రమలై లక్ష్మీనరసింహస్వామి కొండకు శనివారం వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆలయం సమీప కొండలో మంగళవారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

News August 11, 2025

ఈనెల 14న మాజీ సీఎం జగన్ అనంతపురానికి రాక

image

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 14న అనంతపురం రానున్నారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి హాజరు కానున్నారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా హెలిప్యాడ్, బారికేడ్లు తదితర ఏర్పాట్లను విశ్వేశ్వర రెడ్డితో కలిసి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిశీలిస్తున్నారు.

News August 11, 2025

ఈనెల 18న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా

image

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేయనున్నట్లు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు తెలిపారు. రాయదుర్గంలో ఆదివారం స్థానిక కమిటీల ఏర్పాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని మండిపడ్డారు.