News March 24, 2025
రాత్రి భోజనం తర్వాత ఇలా చేయండి!

కొన్ని అలవాట్లు రాత్రి తిన్న తర్వాత జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ‘తిన్న తర్వాత ఓ 10 ని.లు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఓ 30 ని.లు పడుకోకుండా ఉంటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉండవు. సోంపు లేదా వాము నమిలితే బాగా జీర్ణమై మలబద్ధకం తగ్గుతుంది. కొద్దిసేపు నిటారుగా కూర్చున్నా మంచిదే’ అని తెలిపారు.
Similar News
News March 29, 2025
హిమాచల్తో విద్యుత్ ఒప్పందం గొప్ప ముందడుగు: భట్టి

TG: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని హిమాచల్ప్రదేశ్తో 520MW ఒప్పందం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇదొక గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. థర్మల్ పవర్ కంటే జల విద్యుత్ వ్యయం తక్కువగా ఉంటుందని తెలిపారు. హిమాచల్లో జీవ నదులు ఎక్కువగా ఉన్నందున 9-10నెలలు విద్యుత్ ఉత్పత్తికి వీలు ఉంటుందన్నారు. దీంతో తక్కువ ధరకే పవర్ దొరుకుతుందని పేర్కొన్నారు.
News March 29, 2025
ఈ రాశుల వారికి రేపటి నుంచి పండగే!

చాలా మంది రాశి ఫలాలను నమ్ముతుంటారు. ఉగాది వచ్చిందంటే చాలు ఆ ఏడాది తమ రాశి ఫలం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. రేపటి నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభంకానుంది. దీంతో కొత్త పంచాంగం అందుబాటులోకి రానుంది. అయితే ఈ నూతన ఏడాది మిథునం, కర్కాటకం, తుల, కన్య రాశుల వారి ఫలితాలు అద్భుతంగా ఉండనున్నట్లు పురోహితులు చెబుతున్నారు. వీరికి కొత్త ఏడాది శుభ ఫలితాలే. ఇంతకీ మీది ఏ రాశి? COMMENT
News March 29, 2025
వృద్ధ దంపతుల ప్రాణాలు తీసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ మోసగాళ్ల దోపిడీతో కర్ణాటకకు చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు వీరికి వీడియో కాల్ చేసి తాము ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులమని.. మీపై కేసులయ్యాయని బెదిరించారు. దీంతో భయపడిన దంపతులు తొలుత రూ.5లక్షలు చెల్లించారు. అక్కడితో ఆగకుండా తరచుగా బెదిరిస్తూ రూ.50 లక్షలు దోపిడీ చేశారు. దీంతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి సూసైడ్ లెటర్లో ఆత్మహత్య కారణాలు రాశారు.