News March 24, 2025
అనకాపల్లి: పదవ తరగతి పరీక్షకు 202 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి గణితం పరీక్షకు 202 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,681 హాజరైనట్లు చెప్పారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 685 మంది హాజరు కావలసి ఉండగా 576 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
Similar News
News March 29, 2025
తుళ్లూరు: సీఎం రూట్ మ్యాప్ పరిశీలించిన ఎస్పీ

P-4 కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు వెలగపూడి వద్ద ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్, అడిషనల్ ఎస్పీ సుప్రజా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే రూట్ మ్యాప్ను పరిశీలించారు. అనంతరం స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా CM వచ్చే రూట్లో కూడా ఏరియా డామినేషన్ పార్టీలు తిరగనున్నట్లు చెప్పారు.
News March 29, 2025
సెలవు రోజు కూడా బిల్లులు చెల్లించవచ్చు: ప్రకాశం SE

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టే కేంద్రాలు 30,31వ తేదీల్లో పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం సెలవు రోజుల్లో కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. కాబట్టి వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. నెలాఖరు అయినా తక్కువ చెల్లింపులు జరిగాయని అన్నారు.
News March 29, 2025
రాష్ట్రంలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలు.. కీలక ప్రకటన

TG: రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో VRO, VRAలుగా పని చేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించనుంది. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ఇంటర్ పూర్తి చేసి VRO/VRAగా కనీసం ఐదేళ్లు పని చేయాలి. వీరికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి ఎంపిక చేస్తారు. విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికెట్ల ఎంక్వైరీ లాంటి విధులు ఉంటాయి.