News March 24, 2025
అరటి రైతులకు రూ.1.10 లక్షలు: అచ్చెన్న

AP: వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ మొదలవుతుందన్నారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35,000 ఇన్పుట్ సబ్సిడీ, మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో రూ.75వేలు అందజేస్తామని ప్రకటించారు. మొత్తంగా రూ.1.10 లక్షలు సాయం చేస్తామన్నారు.
Similar News
News January 25, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ITI, డిప్లొమా, BSc(MPC/CS)అర్హత గలవారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 28వరకు పంపాలి. వయసు 18 నుంచి 36ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. టెక్నీషియన్కు నెలకు రూ.22,240, టెక్నికల్ అసిస్టెంట్కు రూ.31,020 చెల్లిస్తారు. సైట్: https://recruit.cusat.ac.in
News January 25, 2026
వంటింటి చిట్కాలు

* బంగాళదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే, చేతులకు కాస్త ఆయిల్ రాసుకొని వాటికి రుద్దాలి.
* గోధుమ పిండి, శెనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే, డబ్బాలో బిర్యానీ ఆకులు వేసి ఉంచాలి.
* కాకరకాయ ముక్కలు చేదు పోవాలంటే పెరుగు, కొద్దిగా గోధుమ పిండి, ఉప్పు కలిపిన మిశ్రమంలో కాసేపు ఈ ముక్కల్ని నానబెట్టి తరువాత వండాలి.
* క్యాలీఫ్లవర్ ఉడికించేప్పుడు కాసిని పాలు పోస్తే కూర రంగు మారదు.
News January 25, 2026
తెలుగు రాష్ట్రాల్లో విషాదం.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు ఘటనల్లో ఐదుగురు మరణించారు. నాగర్ కర్నూల్(D) ముచ్చర్లపల్లిలో నీటి గుంతలో పడి సిరి(14), శ్రీమన్యు(14), స్నేహ(15) అనే ముగ్గురు విద్యార్థులు మరణించారు. గుంతలో పడిన ఒకరిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు చనిపోయారు. APలోని నెల్లూరు(D) తూర్పు రొంపిదొడ్లలో ఇద్దరు యువకులు గణేశ్ (16), రమేశ్ (15) బైక్పై వెళ్తుండగా కందిచేను చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి సజీవదహనమయ్యారు.


