News March 24, 2025

NZB: యథావిధిగా పాఠశాలలు

image

ఈ నెల 25న అన్ని పాఠశాలలు యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని డీఈఓ అశోక్ తెలిపారు. పదో తరగతి పరీక్షల దృష్ట్యా ఎగ్జామ్ సెంటర్లు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తుండగా 25న ఎస్ఎస్సీ పరీక్ష లేకపోవడంతో ఈ సవరణ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్ విధులు నిర్వర్తిస్తున్న వారు యథావిధిగా తమ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు.

Similar News

News July 11, 2025

NZB: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

image

నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు SI హరిబాబు గురువారం తెలిపారు. పంబౌలి ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నారనే పక్క సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ అఫ్రోజ్, షేక్ అయాజ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు నుంచి 238 గ్రాముల గంజాయిని స్వాధీన పరుచుకొని, రిమాండ్‌కు తరలించారు.

News July 11, 2025

NZB: న్యూసెన్స్ చేసిన వ్యక్తికి 7 రోజుల జైలు: SHO

image

మద్యం అతిగా సేవించి రైల్వే స్టేషన్ ఏరియాలో న్యూసెన్స్ చేసి శాంతిభద్రతలకు ఆటంకం కలిగించిన షేక్ ఫెరోజ్ (30) అనే వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి గురువారం తీర్పు చెప్పారని NZB వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మగడమునగర్‌కు చెందిన షేక్ ఫెరోజ్ బుధవారం రాత్రి రైల్వే స్టేషన్ వద్ద అతిగా మద్యం సేవించి హంగామా చేశాడన్నారు.

News July 11, 2025

NZB: జనాభా నియంత్రణకు కృషి చేయండి: DM& HO

image

జనాభా నియంత్రణకు సిబ్బంది కృషి చేయాలని నిజామాబాద్ DM&HO డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలపై వివిధ PHCల వైద్యాధికారులతో గురువారం జిల్లాస్థాయి సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో DM&HO మాట్లాడుతూ తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల పట్ల ప్రజల్లో అవగాహణ కల్పించాలని సూచించారు.