News March 24, 2025

భువనగిరి: పది పరీక్షలకు 10 మంది డుమ్మా

image

భువనగిరి జిల్లాలో పది పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు DEO సత్యనారాయణ తెలిపారు. మూడవ రోజు ఇంగ్లీషు పరీక్ష 50 పరీక్ష కేంద్రాల్లో జరగగా ఆయన 4, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్ష కేంద్రాలను సందర్శించామన్నారు. మొత్తం 8,618 విద్యార్థులకు 8,608 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 10మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Similar News

News March 30, 2025

వైజాగ్ మ్యాచ్ చూసేందుకు జైషా

image

విశాఖ వేదికగా జరుగుతున్న SRH-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను చూసేందుకు ఐసీసీ ఛైర్మన్ జై షా స్టేడియానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి లోకేశ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆయన వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏసీఏ అధికారుల చేశారు. వచ్చే విమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ విశాఖలో జరిపేందుకు సన్నాహాలు జరుపుతున్న నేపథ్యంలో ఆయన స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 

News March 30, 2025

తెలంగాణ భవన్‌లో పంచాంగం.. మళ్లీ సీఎంగా కేసీఆర్

image

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని అర్చకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌, బొల్లం మల్లయ్య యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

News March 30, 2025

కాంట్రాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త

image

AP: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తామని, సుమారు 17 వేల మందికి రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నాబార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని వివరించారు.

error: Content is protected !!