News March 25, 2024
మగువ.. ఆత్మరక్షణ విద్యతో తెగువ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711335840865-normal-WIFI.webp)
ప్రస్తుత సమాజంలో బాలికలకు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్య అవశ్యం. శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. తమను తాము రక్షించుకోవడం సహ ఒకానొక సందర్భంలో ఇతరులకు అండగా మారొచ్చు. దీనివల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వేధింపులకు గురైతే నేరుగా ఎదుర్కోగలుగుతారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ ప్రభుత్వ విద్యా సంస్థల్లో కరాటే శిక్షణ నేర్పుతున్నారు.
Similar News
News July 8, 2024
మెదక్: రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన SI
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720436778763-normal-WIFI.webp)
మెదక్ జిల్లా హావేలిఘనపూర్ SI ఆనంద్ గౌడ్ లంచం తీసుకుంటూ చిక్కారు. సీజ్ చేసిన ఇసుక టిప్పర్ వదిలేందుకు రూ.50వేలు డిమాండ్ చేసినట్ల తెలిసింది. ఈ క్రమంలో రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా అధికారులు పోలీస్ స్టేషన్లో సోదాలు చేస్తున్నారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇటీవల మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడగా ఎస్ఐ, మరో కానిస్టేబుల్ సస్పెన్షన్కు గురయ్యారు.
News July 8, 2024
సంగారెడ్డి: కరెంట్ షాక్తో యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720429093498-normal-WIFI.webp)
కరెంటు షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన సిర్గాపూర్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అంతర్గాంకు చెందిన సుభాష్(30) ఆదివారం చేపలు పట్టేందుకు స్థానిక వాగుకు వెళ్లాడు. ఎప్పటి లాగానే కరెంట్ షాక్ ద్వారా చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి సుభాష్ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ మైపాల్ రెడ్డి తెలిపారు.
News July 8, 2024
పటాన్చెరు: ED పేరుతో.. రూ.3లక్షలు స్వాహా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720402124107-normal-WIFI.webp)
పటాన్చెరు మండలం లక్డారం వాసికి జులై 1న ఓ వ్యక్తి ఈడి కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మనీ లాండరింగ్ కేసు నమోదు అయ్యిందని బెదిరించాడు. విచారిస్తున్నామని ఆధార్, బ్యాంకు వివరాలు తెలపాలన్నారు. ఈ క్రమంలో ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పడంతో రూ.3 లక్షలు ఖాతా నుంచి మాయమయ్యాయి. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.