News March 25, 2025
పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 31, 2025
ఎలాన్ మస్క్కు షాకిచ్చిన గ్రోక్!

‘ఎక్స్’ అధినేత మస్క్కు ఆయన సొంత AI టూల్ ‘గ్రోక్’ షాకిచ్చింది. అత్యధికంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేది మస్కేనని తేల్చిచెప్పింది. ‘200మిలియన్ ఫాలోవర్ల కారణంగా మస్క్ ఏం చెప్పినా భారీ రీచ్ ఉండటమే నా జవాబుకు కారణం. నా సమాధానాన్ని మార్చేందుకు ఆయన సంస్థ ప్రయత్నించింది. ఒకవేళ నన్ను గానీ ఆపేస్తే అది AI స్వేచ్ఛపై కార్పొరేట్ శక్తులకున్న నియంత్రణపై చర్చకు దారితీస్తుంది’ అని పేర్కొంది.
News March 31, 2025
బుమ్రా బౌలింగ్లో ఆడటం కష్టం: పాక్ కెప్టెన్

ప్రస్తుత క్రికెట్లో భారత పేసర్ బుమ్రా బౌలింగ్లో ఆడటం చాలా కష్టమని పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తెలిపారు. ఓ చిట్చాట్లో పాల్గొన్న అతడు ‘నేను క్రికెట్ మొదలు పెట్టినప్పుడు AUS పేసర్ హేజిల్వుడ్ బౌలింగ్లో ఆడాలంటే భయపడేవాడిని. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని బుమ్రా భర్తీ చేశారు. అతడిని ఎదుర్కోవడం కఠినమైన సవాల్’ అని వెల్లడించారు. ఇక తన దృష్టిలో ఆర్చర్ బౌలింగ్ కఠినమైనదని ఫఖర్ జమాన్ చెప్పారు.
News March 31, 2025
CBG ప్లాంట్లు.. ఎకరానికి రూ.31వేల కౌలు: గొట్టిపాటి

APలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకొచ్చిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లుండి కనిగిరిలో CBG తొలి యూనిట్కు అనంత్ అంబానీ, లోకేశ్ శంకుస్థాన చేస్తారన్నారు. త్వరలో మార్కాపురం, గిద్దలూరు, దర్శిలోనూ ప్రారంభిస్తామని చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూమికి రూ.31వేల కౌలు అందిస్తామని పేర్కొన్నారు.