News March 25, 2025
NRPT: వారికి కలెక్టర్ WARNING

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. వారం రోజులలో పనితీరు మెరుగుపర్చుకుని, లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆమె ఆదేశించారు. సోమవారం నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉట్కూరు, కోస్గి, నారాయణపేట, మద్దూర్, దామరగిద్ద మండలాల అధికారులతో ఉపాధి హామీ, హరితహారం, స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు.
Similar News
News March 31, 2025
KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్లో రాజు స్థానంలో అశ్విని కుమార్ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.
News March 31, 2025
రంజాన్ వేళ.. HYDలో వీటికి ఫుల్ DEMAND

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.
News March 31, 2025
వికారాబాద్: 17 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

పదోతరగతి అంటే ఓ మధుర జ్ఞాపకం.. జీవితంలో ఎంత ఎదిగినా సరే టెన్త్ ఫ్రెండ్స్ కలిస్తే చెప్పలేని సంతోషం..ఆ రోజుల్లో చేసిన అల్లరి గుర్తుకొస్తే ఎంతో బాగుంటుంది. VKBజిల్లా ధారూర్ మండలం నాగసమందర్ ZPHSలో 2007-2008 బ్యాచ్కు చెందిన టెన్త్ పూర్వ విద్యార్థులు 17ఏళ్ల తర్వాత సోమవారం ఒక చోట కలుసుకున్నారు.యోగ క్షేమాలు తెలుసుకుని, నాటి గురువులను సన్మానించారు. మరి మీరు మీ టెన్త్ ఫ్రెండ్స్ను కలిశారా?కామెంట్ చేయండి.