News March 25, 2024
ప్రత్తిపాడు: ప్రధాన పార్టీల్లో ముదిరిన వర్గపోరు

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలను వర్గపోరు వెంటాడుతోంది. ఇప్పటికే వైసీపీ రెబల్ అభ్యర్థిగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుకు వ్యతిరేకంగా పూనాటి రమేశ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటంతో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. వర్గపోరును తట్టుకొని ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.
Similar News
News April 5, 2026
PGRS అర్జీల స్థితిని తెలుసుకోండిలా: GNT కలెక్టర్

గుంటూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూక్లీనిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. మీకోసం వెబ్ సైట్లో ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని, సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చేసుకోవచ్చని చెప్పారు.
News April 5, 2026
గుంటూరులో ఓపెన్ డ్రింకింగ్.. 179 మందిపై కేసులు

గుంటూరు జిల్లాలో బహిరంగ మద్యం తాగే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. SP వకుల్ జిందాల్ ఆదేశాలతో నిన్న సాయంత్రం 5:30 నుంచి 9గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో 178 కేసులు నమోదు చేసి, 179 మందిపై చర్యలు తీసుకున్నారు. ఇందులో 8 FIR కేసులు, 170 పెట్టి కేసులు ఉన్నాయి. ప్రధాన రహదారులు, కాలనీలు, గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు చట్టాలను పాటించాలని పోలీసులు సూచించారు.
News April 5, 2026
యువ అధికారుల పాలనలో గుంటూరు జిల్లా..!

గుంటూరు జిల్లాలో పాలన బాధ్యతలు యువ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ, జేసీ ఆశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు. గతంలో సమన్వయం లోపంతో పురోగతి మందగించిందని భావించిన ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు సమాచారం. వీరు భూ వివాదాలు, రేషన్ అక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. నగరంలో డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు అవసరమని ప్రజలు ఆశిస్తున్నారు.


