News March 25, 2025

AP EAPCETకు 1.12లక్షల దరఖాస్తులు

image

ఏపీ ఈఏపీసెట్‌కు ఇప్పటివరకు 1,12,606 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 15న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 24 వరకు కొనసాగనుంది. అపరాధ రుసుముతో మే 16 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.

Similar News

News July 7, 2025

గుత్తా జ్వాల కుమార్తెకు పేరు పెట్టిన ఆమిర్ ఖాన్

image

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ దంపతుల కుమార్తెకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేరు పెట్టారు. HYD వచ్చి మరీ వారి పాపకు మిరా అని నామకరణం చేశారు. కాగా ‘మిరా అంటే ప్రేమ, శాంతి. ఆమిర్ సర్‌ మీతో ప్రయాణం ప్రత్యేకం. మా పాపకు అద్భుతమైన పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు’ అని విశాల్ SMలో పోస్ట్ చేశారు. 2021 ఏప్రిల్ 22న వీరు వివాహం చేసుకోగా వారికి ఈ ఏప్రిల్ 22న పాప పుట్టింది.

News July 7, 2025

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 50 వేల ఉద్యోగాలు!

image

2025-26 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు 50 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. 21 వేల మంది ఆఫీసర్ల విభాగంలో కాగా, మిగిలినవి క్లర్కులు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ నియామకాల్లో కేవలం SBI ఒక్కటే 20 వేల మందిని నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది.

News July 7, 2025

భారత్‌లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’: మోదీ

image

రెస్పాన్సిబుల్ AIకోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని PM మోదీ తెలిపారు. వచ్చే ఏడాది భారత్‌లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’ నిర్వహిస్తామన్నారు. ‘వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో భారత్ AIని సమగ్రంగా ఉపయోగిస్తోంది. ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. డిజిటల్ కంటెంట్ ప్రామాణికతను ధృవీకరించే గ్లోబల్ స్టాండర్డ్స్ తేవాలి. కంటెంట్ మూలం తెలిస్తే.. పారదర్శకత ఉండి, దుర్వినియోగాన్ని కట్టడి చేయొచ్చు’ అని పేర్కొన్నారు.