News March 25, 2025

పంట నష్టానికి త్వరలో పరిహారం: మంత్రి తుమ్మల

image

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. పంట నష్టం వివరాలు సేకరించేందుకు అధికారులను నియమించామని తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక రాగానే పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 16, 2026

కొబ్బరి చెట్లకు నీరు ఇలా అందిస్తే మంచిది

image

కొబ్బరి తోటల్లో నేల తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో నీటిని తోటలలో పారించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృథా అయ్యి తెగుళ్లు కూడా తొందరగా ఇతర మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్లెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా లేదా డ్రిప్ విధానంలో తోటలకు నీటిని అందించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.

News February 16, 2026

ఇంటర్వ్యూతో IRCTCలో ఉద్యోగాలు

image

<>IRCTC<<>> 43 హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc హాస్పిటాలిటీ& హోటల్ మేనేజ్‌మెంట్, BBA/MBA, BSc హోటల్ మేనేజ్‌మెంట్/క్యాటరింగ్ సైన్స్ ఉత్తీర్ణులు అర్హులు. అర్హత గలవారు FEB 17న భోపాల్‌లో, FEB 24న ముంబైలో, FEB 27న గోవాలో, మార్చి 5న గాంధీనగర్(GJ)లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. నెలకు రూ.30వేలు+డైలీ అలవెన్సులు రూ.350 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.irctc.com

News February 16, 2026

అమావాస్య రోజున పిల్లలు పుట్టడం అశుభమా?

image

దీని గురించి వేద పురాణాల్లో అశుభంగా ఎక్కడా పేర్కొనలేదని పండితులు చెబుతున్నారు. ‘ఈ తిథి పితృదేవతల ఆశీస్సులు గల పవిత్రమైన రోజు. అమావాస్య నాడు పుట్టిన పిల్లలు బలమైన ఆధ్యాత్మికత, తెలివితేటలు, లోతైన ఆలోచనా ధోరణి కలిగి ఉంటారు. ఏవైనా స్వల్ప దోషాలు ఉన్నాయని భావిస్తే శాంతి పూజలు జరిపించుకోవాలి. అలా నివృత్తి చేసుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు వారి కర్మ, పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది కానీ తిథిపై కాదు’ అంటున్నారు.