News March 25, 2025
తాడేపల్లిలో వివాహిత దారుణ హత్య (అప్డేట్)

తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి లక్ష్మీ తిరుపతమ్మ (పామర్రుకు చెందిన వివాహిత) హత్యకు గురైన విషయం తెలిసిందే. లక్ష్మీ తిరుపతమ్మతో సన్నిహితంగా ఉండే బిహార్కు చెందిన కార్మికులు హత్య చేసినట్లు ఆమె సోదరుడు ఆరోపించాడు. పోలీసులు లక్ష్మీ తిరుపతమ్మ స్నేహితురాలిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సోమవారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేశారు.
Similar News
News March 29, 2025
కృష్ణా: జిల్లాలో పర్యటించిన ఎస్సీ కమిషన్ సభ్యురాలు

ఎస్సీలపై పెరుగుతున్న వివక్షను ఖండిస్తూ పెడన ఎస్సీ సంఘాల వారు ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ సభ్యురాలు మల్లేశ్వరి శుక్రవారం పెడనలో 6వ వార్డును సందర్శించారు. స్థానిక ఎస్సీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వివక్షతకు గురవుతున్న పరిస్థితులపై వివరాలు సేకరించారు. పెడనలో జరుగుతున్న అన్యాయంపై నివేదిక రూపొందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News March 28, 2025
కృష్ణా: డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకోండి- కలెక్టర్

యువత డ్రగ్స్ బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన నార్కోటిక్ కో-ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు హాజరై డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్తో కలిసి సమీక్షించారు.
News March 28, 2025
కృష్ణాజిల్లాలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ల నియామకం

కృష్ణాజిల్లాలో 4 మార్కెట్ యార్డుల ఛైర్మన్లను ప్రభుత్వం శుక్రవారం నియమించింది. గుడ్లవల్లేరు మార్కెట్ యార్డు ఛైర్మన్ పొట్లూరి రవి కుమార్ (టీడీపీ), కంకిపాడు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అన్నే ధనరామ కోటేశ్వరరావు(టీడీపీ), ఘంటసాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తోట కనకదుర్గ (జనసేన), మొవ్వ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దోనేపూడి శివరామయ్య (బీజేపీ) నియమితులయ్యారు.