News March 25, 2024
ఏడు రోజుల లక్ష్యం రూ.75.74 కోట్లు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో ఏడు రోజుల్లో రూ.75.74 కోట్ల వసూలు లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది మొత్తం వసూళ్ల లక్ష్యం రూ.130.02 కోట్లు కాగా ఇప్పటికి రూ.54.,28 కోట్లు వసూలు చేశారు. పన్నులు చెల్లించాలని కోరుతూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు.
Similar News
News March 11, 2026
NLR: సిలిండర్ల కొరత అంటూ ప్రచారం.. వాస్తవం ఇదే.!

జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని సంబంధిత శాఖ అధికారిని లీలారాణి తెలిపారు. జిల్లాలోని అన్ని అధీకృత LPG డిస్ట్రిబ్యూటర్ల వద్ద సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. సిలిండర్ల కొరత ఉందనే వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. ఎవరైనా డిస్ట్రిబ్యూటర్, ఏజెన్సీ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు మళ్లించడం, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
News March 11, 2026
నెల్లూరు: 9వ తరగతి విద్యార్థులకు గమనిక

ఇస్రో ఆధ్వర్యంలో జరగనున్న యువిక-2026 ఉచిత శిక్షణకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలో 9th విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా www.isro.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు పంపించాలన్నారు. ఏప్రిల్ 20వ తేదీన సెలక్ట్ చేసిన విద్యార్థులు మే 11 – 22 తేదీ వరకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
News March 11, 2026
రైల్వే బిట్రగుంట గురించి మీకు తెలుసా…?

రైల్వే బిట్రగుంట చాలామందికి తెలుసు. దేశంలోనే పేరు పొందిన లోకో షెడ్ ఇక్కడుండేది. వేలాది మంది కార్మికులు పనిచేసేవారు. దీన్నే లిటిల్ ఇంగ్లాండనేవారు. రైల్వే కంటోన్మెంటనీ పిలిచేవారు. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల రాకతో లోకో షెడ్ అవసరం తీరింది. సహజంగానే మూతపడింది. రైల్వే షెడ్తో ప్రఖ్యాతి పొందిన రైల్వే బిట్రగుంట ఇప్పుడు అజ్ఞాతంగా ఉంది. వందల కోట్లు ఆస్తులు ఉన్నా.. ఇప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తోంది.


