News March 25, 2024

కొండగట్టు నిధుల దుర్వినయోగంపై లోతుగా దర్యాప్తు!

image

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నిధుల దుర్వినియోగంపై దేవదాయశాఖ ఉన్నతాధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఆలయానికి సంబంధించి 2014 నుంచి రికార్డుల పరిశీలనకు నిర్ణయించినట్లు, క్యాష్‌బుక్‌, బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇతర ఫైళ్లను రీకన్సులేషన్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.గతంలో పనిచేసిన ఈవోల పదవీకాలంలోనూ నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికరులు భావిస్తున్నారు.

Similar News

News September 8, 2025

KNR: నేడు రాజకీయ పార్టీల నేతలతో జిల్లా కలెక్టర్ సమావేశం

image

కరీంనగర్ నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం రాజకీయ పార్టీలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాటుపై సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సలహాలు, సూచనలు అందించాలని కోరారు.

News September 7, 2025

కరీంనగర్‌లో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం

image

KNR DCC కార్యాలయంలో ఆదివారం జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని బ్లాక్, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకురాళ్లు తమ అభిప్రాయాలు, సూచనలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.

News September 7, 2025

కరీంనగర్: ఓపెన్ స్కూల్లో చేర్చాలి

image

స్వయం సహాయక సంఘాల సభ్యులను ఓపెన్ స్కూల్లో చేర్చాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మెప్మా, డీఆర్‌డీఓ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఉల్లాస్ రిజిస్ట్రేషన్లపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన సభ్యులందరినీ వెంటనే ఓపెన్ స్కూల్లో చేర్పించి, విద్యను ప్రోత్సహించాలని సూచించారు.