News March 25, 2025

సూర్యాపేట: CM రేవంత్ రాక.. సభా ఏర్పాట్ల పరిశీలన

image

CM రేవంత్ ఈ నెల 30 ఉగాదిన సూర్యాపేట జిల్లా HNRకు రానున్నారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

Similar News

News March 31, 2025

పల్నాడు: దంచి కొడుతున్న ఎండలు.. 40 డిగ్రీల పైనే.!

image

పల్నాడు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాలు, ప్రాంతాల్లో ఉదయం 11 గంటలకే 40 డ్రిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు ఇంకేలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎండ నుంచి ఉపశమనం పోందెందుకు.. కొబ్బరి నీళ్లు, చల్లటి పానీయాలు, పుచ్చకాయలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

News March 31, 2025

రంజాన్ స్పెషల్.. పసందైన విందు

image

రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ముస్లిం సోదరులు ఇచ్చే విందు. మతాలకు అతీతంగా స్నేహితులు, సన్నిహితులను తమ ఇళ్లకు పిలిచి పసందైన చికెన్ బిర్యానీ వడ్డిస్తారు. ఆ తర్వాత తియ్యటి షేమియా తినిపిస్తారు. అనంతరం ఆత్మీయంగా హత్తుకుని పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరి మీకూ ముస్లిం స్నేహితులు ఉన్నారా? ఈద్ సందర్భంగా మిమ్మల్ని విందుకు ఆహ్వానించారా? కామెంట్ చేయండి.

News March 31, 2025

భూపాలపల్లి: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్‌ను ఫైనల్ చేయలేదు.కాగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికార పార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇళ్లు ఇప్పిస్తామని పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.

error: Content is protected !!