News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News March 31, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

image

శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు.

News March 31, 2025

నేటితో ముగియనున్న కొమ్మాల జాతర

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర హోలితో ప్రారంభమై ఉగాది పండగ సందర్భంగా నేడు కొత్త సాలుతో ముగుస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం హుండీ ఆదాయం ఎక్కువగా వచ్చిందని పేర్కొన్నారు.

News March 31, 2025

కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరోసారి నోటీసులు

image

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి <<15944206>>నోటీసులు<<>> జారీ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్ విషయంలో ఇవాళ విచారణకు రావాలని నిన్న నోటీసులు ఇవ్వగా ఆయన హాజరు కాలేదు. దీంతో రేపు ఉదయం 11గంటలకు విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో నోటీసులు ఇచ్చారు. రేపు కూడా కాకాణి విచారణకు గైర్హాజరైతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

error: Content is protected !!