News March 25, 2025

నేటి నుంచే ఆధార్ నమోదు శిబిరాలు

image

AP: రాష్ట్రంలో రెండో విడత ఆధార్ నమోదు క్యాంపులు నేటి నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 6సంవత్సరాలలోపు చిన్నారులు డేట్‌ ఆఫ్‌ బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా నమోదు చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ సైతం ఈ కేంద్రాల వద్ద చేసుకోవచ్చు. ఈ మేరకు అధికారులు గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆధార్ నమోదు చేసుకోని పిల్లల సంఖ్య 1,86,709 ఉన్నట్లు గుర్తించారు.

Similar News

News March 31, 2025

తెలంగాణ టు ఫిలిప్పీన్స్.. వయా కాకినాడ

image

ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్‌కు బియ్యాన్ని ఎగుమతి చేయనుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఎక్స్‌పోర్ట్‌కు ఒప్పందం కుదరగా తొలి విడతగా ఇవాళ 12,500 టన్నుల MTU 1010 రకాన్ని పంపనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కాకినాడ వెళ్లి బియ్యం నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన వెంటన ఫిలిప్పీన్స్ ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నారు.

News March 31, 2025

చైనా వండర్.. సముద్ర గర్భంలో డేటా సెంటర్

image

టెక్నాలజీలో చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలో తొలిసారిగా సముద్రం లోపల AI డేటా సెంటర్ ఏర్పాటు చేసింది. హాంకాంగ్‌కు ఆగ్నేయ దిశలోని లింగ్ షుయి తీరంలో దీన్ని ప్రారంభించింది. ఇక్కడ 400 హైపెర్ఫార్మెన్స్ సర్వర్లను కూల్ చేసే సౌకర్యాలు ఉంటాయి. ఒక సెకన్‌లో పారిశ్రామిక రంగం నుంచి మెరైన్ రీసెర్చ్ వరకు 7వేల Ai ప్రశ్నలను ప్రాసెస్ చేస్తుంది. ఇది ఆరంభమేనని, మున్ముందు వీటి సంఖ్యను పెంచుతామని పేర్కొంది.

News March 31, 2025

1 కాదు, 2 కాదు.. 10 ప్రభుత్వ ఉద్యోగాలు

image

TG: ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టం అవుతున్న ఈ రోజుల్లో భూపాలపల్లి (D) గుంటూరుపల్లికి చెందిన V. గోపీకృష్ణ 10 ఉద్యోగాలు సాధించారు. తాజాగా, TGPSC రిలీజ్ చేసిన గ్రూప్-1 ఫలితాల్లో 70వ ర్యాంకర్‌గా నిలిచారు. ఈయన ఇప్పటి వరకు 7 కేంద్ర, 3 రాష్ట్ర ప్రభుత్వ కొలువులు సాధించారు. ప్రస్తుతం గోపి మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌‌గా ట్రైనింగ్ పొందుతున్నారు. త్వరలో గ్రూప్-1 పోస్టులో జాయిన్ అవుతానని చెప్పారు.

error: Content is protected !!