News March 25, 2025

విశాఖ మేయర్ పీఠం.. రంగంలోకి లోకేశ్..?

image

విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌తో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ నేడు సమావేశమయ్యారు. రేపు మంత్రి లోకేశ్ విశాఖ వచ్చి స్థానిక నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. అవిశ్వాసంలో నెగ్గితే మేయర్ పదవి టీడీపీకి.. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Similar News

News November 8, 2025

నేరేడుచర్ల: ఈతకెళ్లి బాలిక గల్లంతు

image

మూసీ నదిలో ఈతకు వెళ్లి సుస్మిత (13) అనే బాలిక గల్లంతైన విషాద ఘటన నేరేడుచర్ల మండలం సోమారంలో శనివారం సాయంత్రం జరిగింది. గ్రామంలోని సోమప్ప సోమేశ్వరాలయం వెనుక ఉన్న నదిలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లగా, సుస్మిత నీట మునిగింది. మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన బాలిక కోసం రెస్క్యూ టీంను రంగంలోకి దించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి.

News November 8, 2025

రాజోలిలో క్షుద్ర పూజలు కలకలం

image

రాజోలి మండల కేంద్రంలోని ఆర్డీటీ కాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇంటిని రేణుక శివశంకర్ దంపతులు అద్దెకు తీసుకొని ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రలో ఉన్నారు. సాయంత్రం ఇంట్లో నుంచి వచ్చి చూడగా ఇంటి గేటు ముందు ఒక బొమ్మపై పసుపు, కుంకుమ పడి ఉండడం చూసి హడలెత్తిపోయామని వారు అన్నారు. ఇదే ఇంట్లో గత నెల 28 తేదీన దొంగతనం జరిగింది.

News November 8, 2025

కొండాపూర్ శివారులో రోడ్డుప్రమాదం.. ఆటోడ్రైవర్ మృతి

image

మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అనుమల్ల గంగాధర్(55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 4న గంగాధర్ భీమారం నుంచి కొండాపూర్ వైపు ఆటోలో వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన గంగాధర్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. దీంతో కేసు నమోదైంది.