News March 25, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ధరలు..?

image

నెల్లూరులో జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. నిరుడు పుట్టి(20 బస్తాలు) రూ.23వేల ధర పలగ్గా.. ఇప్పుడు ఆ ధర రూ.18,500కు తగ్గినట్లు రైతులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఈ ధర రూ.16వేల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రైతులకు రూ.19వేల మద్దతు ధర చెల్లిస్తుంది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధాన్యం ధరలు ఎలా ఉన్నాయో గ్రామం, మండలంతో కామెంట్ చేయండి.

Similar News

News March 29, 2025

ఉగాది వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయండి

image

శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్లో ఉగాది వేడుక నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఉగాది వేడుక నిర్వహిస్తామన్నారు.

News March 28, 2025

ఇఫ్తార్ విందులో ఆనం, అజీజ్‌, కోటంరెడ్డి

image

రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకొని మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌స్తూరిదేవి గార్డెన్స్‌లో శుక్రవారం‌ రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఆనం, వ‌క్ఫ్ బోర్డ్ ఛైర్మ‌న్ అజీజ్‌, నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి, క‌లెక్ట‌ర్ ఆనంద్, కమిషనర్ తోపాటు ముఖ్య నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.  వారు ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు.

News March 28, 2025

నెల్లూరు: ఐదుగురు ఎంపీటీసీలు సస్పెండ్ 

image

విడవలూరు మండలానికి సంబంధించిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆవుల శ్రీనివాసులు(రామచంద్రాపురం), అక్కయ్యగారి బుజ్జమ్మ(పెద్దపాళెం), వెందోటి భక్తవత్సలయ్య(వరిణి), ముంగర భానుప్రకాశ్(దంపూరు), చింతాటి జగన్మోహన్(అలగానిపాడు)ను సస్పెండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.

error: Content is protected !!