News March 25, 2025

MBNR: పసి బిడ్డలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..!

image

ఊహ తెలియని వయసులోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా మారిన ఆ పిల్లలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..ఆకలైనప్పుడు అమ్మా అని ఎన్నిసార్లు పిలిచినా అమ్మ రావట్లేదని ఆ పిల్లలు అంటున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. గద్వాల(D),మల్దకల్(M), చర్లగార్లపాడులోని ముగ్గురు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. నేడు అయిజ(M) యాపదిన్నె వాసులు రాకేశ్, రామాంజనేయులు వారికి రూ.10,500ఆర్థిక సాయం చేశారు.

Similar News

News October 19, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ప్రకటించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సురక్షిత ప్రాంతాలలో రక్షణ పొందాలని సూచించారు.

News October 19, 2025

జూబ్లీ బైపోల్: ఇప్పటికి 127.. ఉన్నది ఒక్కరోజే!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు జోరందుకున్నాయి. అధికారులు ఊహించని విధంగా నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 127 మంది పోటీచేస్తామంటూ ముందుకువచ్చారు. నామినేషన్లు వేసేందుకు తుది గడువు 3 రోజుల (21వ తేదీ వరకు) సమయమున్నా.. ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. 19 ఆదివారం, 20న దీపావళి కావడంతో మంగళవారం ఆఖరి రోజు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి నామినేషన్ వేస్తామని పలువురు ప్రకటించడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.

News October 19, 2025

లక్ష్మీదేవికి కమలాలు సమర్పిస్తున్నారా?

image

లక్ష్మీదేవి పూజలో కమలాలు సమర్పించడం అత్యంత శ్రేష్ఠమని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం.. క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు, ఆమె చేతిలో కమలాన్ని ధరించి ఉండటం. కమలం శుద్ధి, జ్ఞానం, సంపదకు ప్రతీక. పూజలో ఈ పూలు సమర్పించడం ద్వారా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పూజ చేసినట్లు అవుతుంది. తద్వారా ఆమె అనుగ్రహం లభించి, ఇంట ధన, ధాన్య, ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయని విశ్వసిస్తారు.