News March 25, 2025
MBNR: పసి బిడ్డలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..!

ఊహ తెలియని వయసులోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా మారిన ఆ పిల్లలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..ఆకలైనప్పుడు అమ్మా అని ఎన్నిసార్లు పిలిచినా అమ్మ రావట్లేదని ఆ పిల్లలు అంటున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. గద్వాల(D),మల్దకల్(M), చర్లగార్లపాడులోని ముగ్గురు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. నేడు అయిజ(M) యాపదిన్నె వాసులు రాకేశ్, రామాంజనేయులు వారికి రూ.10,500ఆర్థిక సాయం చేశారు.
Similar News
News January 10, 2026
శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: పవన్

AP: మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడకుండా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూంలో డయల్ 100 పనితీరుపై అధికారులను ఆరాతీశారు. అంతకుముందు పిఠాపురంలో గొల్లప్రోలు హౌసింగ్ వద్ద నిర్మించిన నూతన బ్రిడ్జిని ఆయన పరిశీలించారు.
News January 10, 2026
సంక్రాంతి వేళ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ

సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వాహనాలతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రద్దీ పెరుగుతుందని సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్ తెలిపారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సరిహద్దు పోలీస్ స్టేషన్ల వద్ద భద్రత పెంచామన్నారు. ప్రయాణికులు సంయమనం పాటించాలని కోరారు. అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
News January 10, 2026
బడ్ చిప్ పద్ధతిలో చెరకు సాగుతో అధిక లాభం

తెలుగు రాష్ట్రాల్లో చెరకు ప్రధాన వాణిజ్య పంటగా లక్షల ఎకరాల్లో సాగవుతోంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీల కొరత వల్ల క్రమంగా ఈ పంట సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఈ తరుణంలో చెరకులో సాగు ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు పొందడానికి కను చిప్పల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దీని సాయంతో నాణ్యమైన చెరకు నారు పెంచి, ప్రధాన పొలంలోని వరుసల్లో నాటినట్లయితే నికర ఆదాయం పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది.


