News March 25, 2025
శ్రీగిరిపై ఉగాది కార్యక్రమాల ఇలా..!

శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 27న మహాలక్ష్మి అలంకారం, బృంగి వాహన సేవ, 28న మహాదుర్గ అలంకారం, కైలాస వాహన సేవ, 29న మహాసరస్వతీ అలంకారం, ప్రభోత్సవం, నందివాహనసేవ వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, 30న ఉగాదిన శ్రీ రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం, పంచాంగ శ్రవణం, రథోత్సవం, 31న శ్రీ భ్రమరాంబాదేవి నిజాలంకరణ, పూర్ణాహుతి, అశ్వవాహన సేవ జరుగుతుంది.
Similar News
News September 19, 2025
HYD: నేడు HCUలో విద్యార్థి సంఘం ఎన్నికలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుతుంది. నేడు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపస్లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం సాయంత్రం బ్యాలెట్ బాక్స్లను ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు.
News September 19, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్ట్.. 38 గేట్లు ఎత్తివేత

గురువారం కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని 62 గేట్లలో 38 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మత్సకారులు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News September 19, 2025
సిరిసిల్ల: పేకాటస్థావరంపై దాడులు.. ఒకరు మృతి

ఎల్లారెడ్డిపేట మం. వెంకటపూర్లో గురువారం రాత్రి పోలీసులు <<17757085>>పేకాటస్థావరంపై దాడులు<<>> చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చాకలి రాజయ్య(55) భయంతో పరుగులు తీశాడు. చీకటి పడ్డా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలించారు. ఈ క్రమంలో వాగు సమీపంలో రాజయ్య పడున్నాడు. కుటుంబ సభ్యులు చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. పరుగులు తీయడంతోనే రాజయ్య కుప్పకూలాడని, ఈ క్రమంలో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.