News March 25, 2025

అరబ్ దేశంలో పోలవరం వాసి మృతి

image

పోలవరం మండల కేంద్రానికి చెందిన షేక్ యూసఫ్ మంగళవారం తెల్లవారుజామున అరబ్ దేశంలో గుండెపోటుకు గురై మరణించారు. ఎన్నో ఏళ్లుగా అరబ్ దేశంలో పనిచేస్తూన ఆయన స్వగ్రామానికి నెల రోజులక్రితం వచ్చి తిరిగి వెళ్లాడు. అందరితో అప్యాయంగా మెలిగేవాడని యూసఫ్ ఇక లేరనే మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News January 20, 2026

కోటప్పకొండకు రానున్న డిప్యూటీ సీఎం పవన్: ఎమ్మెల్యే

image

కోటప్పకొండ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండలో నూతన రహదారుల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించగా, ఈ నెల 22న వస్తానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఏర్పాట్లను కూడా పరిశీలించనున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

News January 20, 2026

హ్యాట్సాఫ్.. రూ.2కోట్ల ఆస్తిని దానం చేశారు

image

AP: నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ యావదాస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు. దాదాపు రూ.2కోట్ల విలువజేసే ఆస్తి ఆలయానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి రాసిచ్చేసిన ఈ దంపతులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News January 20, 2026

కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డిపై కంప్లైంట్

image

ఖమ్మం సభలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. సోమవారం ఎస్పీ రోహిత్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. ‘బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతున పాతాలి, గ్రామాల్లో పార్టీ దిమ్మెలను కూల్చాలి’ అంటూ హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.