News March 25, 2025

సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

image

హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు ముందు భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

Similar News

News March 29, 2025

నరసాపురం: ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష, జరిమానా

image

దొంగతనం కేసులో ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై భాస్కరరావు తెలిపారు. నరసాపురం పట్టణానికి చెందిన తిరుమాని చక్రధర్ (చక్రి) 2022 సంవత్సరంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తీ వద్ద నుంచి మొబైల్ చోరీ చేశాడన్నారు. అప్పటి ఎస్ఐ కె.సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. శుక్రవారం నేరం రుజువు కావడంతో ముద్దాయికి జడ్జి 6నెలలు జైలు శిక్ష, రూ.2వేలు ఫైన్ విధించారన్నారు.

News March 29, 2025

కాకినాడ: 10వ తరగతి పబ్లిక్ పరీక్ష వాయిదా- DEO

image

ఈనెల 31న పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష జరగాల్సి ఉంది.అయితే ఆ రోజు రంజాన్ సెలవు కావడంతో ఆ పరీక్షను ఒకటో తేదీకి మార్చినట్లు డీఈవో రమేష్ తెలిపారు. ఈ సమాచారాన్ని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, హెడ్మాస్టర్లు ఖచ్చితంగా విద్యార్థులకు తెలియజేసి, వారు ఏప్రిల్ 1న పరీక్షకు హాజరయ్యేలా చూడాలని కోరారు.

News March 29, 2025

NTRకు బ్రహ్మరథం పట్టిన బాపట్ల జిల్లా

image

సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున(1982 మార్చి 29న) NTR టీడీపీని స్థాపించారు. ఆ తర్వాత 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. రేపల్లెలో ఎడ్ల వెంకట్రావు, వేమూరులో నాదెండ్ల భాస్కరరావు, బాపట్లలో సీవీ రామరాజు, చీరాలలో చిమట సాంబు, పర్చూరులో దగ్గుబాటి చౌదరి, అద్దంకిలో బాచిన చెంచు గరటయ్య టీడీపీ MLAలుగా గెలిచారు.

error: Content is protected !!