News March 25, 2025

గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

image

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.

Similar News

News March 27, 2025

చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీంకోర్టు

image

చట్టవిరుద్ధంగా నరికిన చెట్లకు ఒక్కో దానికి ₹లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని UPకి చెందిన శివశంకర్‌ అగర్వాల్‌‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరమని అభిప్రాయపడింది. అవి కల్పించే పచ్చదనాన్ని తిరిగి సృష్టించేందుకు కనీసం వందేళ్ల సమయం పడుతుందని పేర్కొంది. దాల్మియా వ్యవసాయ క్షేత్రంలోని 454 చెట్లను అగర్వాల్‌‌ నరికివేశాడు. దీంతో కోర్టు జరిమానా విధించింది.

News March 27, 2025

IPL: రికార్డు సృష్టించిన డికాక్

image

KKR తరపున ఛేజింగ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా క్వింటన్ డికాక్ రికార్డు సృష్టించారు. నిన్న RRతో జరిగిన మ్యాచులో అతడు 97 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు మనీష్ పాండే పేరిట ఉండేది. 2014 ఫైనల్‌లో PBKSపై పాండే 94 పరుగులు చేశారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో క్రిస్ లిన్ (93), మన్వీందర్ బిస్లా (92), గంభీర్ (90) ఉన్నారు.

News March 27, 2025

TGలో ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ.. ఎక్కడంటే?

image

TG: రాష్ట్రంలో కొత్తగా ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్‌సైన్స్ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేయనుంది. వారం రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు విడుదల కానున్నాయి. వర్సిటీ ఏర్పాటుకు రూ.500 కోట్ల నిధులతో పాటు 100 పోస్టులు అవసరమని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

error: Content is protected !!