News March 25, 2025
50 ఏళ్లకే వృద్ధులవుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు: కూనంనేని

TG: అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు 50 ఏళ్లకే వృద్ధులవుతున్నారని ఆయన అన్నారు. వీరికి కార్మిక చట్టాలు అమలవుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రమ, మేధ దోపిడీ ఇక్కడే జరుగుతోందని పేర్కొన్నారు. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా, పగలు, రాత్రి తెలియకుండా వారు జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ ఉద్యోగులపై దృష్టి సారించాలని కోరారు.
Similar News
News March 28, 2025
విషమంగా అంజలి ఆరోగ్యం.. నిందితుడు అరెస్ట్

AP: ఓ వ్యక్తి చేతిలో మోసపోయానంటూ రాజమండ్రిలో <<15894441>>ఆత్మహత్యాయత్నం<<>> చేసిన ఫార్మసీ విద్యార్థిని అంజలి(23) ఆరోగ్యం విషమంగానే ఉంది. ఆమె బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని, నేచురల్గానే రికవరీ అవ్వాలని వైద్యులు చెబుతున్నారు. సూసైడ్ నోటు ఆధారంగా మాధవరావు దీపక్ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అంజలికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని తోటి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
News March 28, 2025
మేకిన్ ఇండియా.. భారీ డీల్

మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్రం భారీ రక్షణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 156 ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్లను (LCH) HAL నుంచి కొనుగోలు చేసేందుకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఓకే చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2.09 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులపై రక్షణ శాఖ సంతకాలు చేసింది. రూ.62 వేల కోట్లతో ఈ హెలికాప్టర్లను కర్ణాటకలోని బెంగళూరు, తుమ్కూర్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేయనుంది.
News March 28, 2025
IPL టికెట్ రూ.2343, పన్నులు రూ.1657!

IPL టికెట్ల ద్వారా మన ప్రభుత్వాలు క్రికెట్ అభిమానులను దోచేస్తున్నాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ఆలోచింపజేస్తోంది. చెన్నైలో బేసిక్ టికెట్ ధర రూ.2343 ఉండగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ (25%) రూ.781 వేశారు. ఆ మొత్తంపై మళ్లీ 28 శాతం జీఎస్టీ వడ్డించారు. ఇందులో కేంద్రానికి 14 శాతం, రాష్ట్రానికి 14 శాతం వెళ్తుంది. రూ.4000లలో పన్నుల రూపంలోనే రూ.1657 తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?