News March 25, 2025

27న జగిత్యాల, ధర్మపురిలో పర్యటించనున్న బీసీ కమిషన్

image

ఈ నెల 27న తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలలో పర్యటిస్తారని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మంగళవారం తెలిపారు. జిల్లాలోని వంశరాజ్, వీరబద్రియ, దొమ్మర కులాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి వస్తున్నారని కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను, వినతులను కమిషన్‌కు సమర్పించాలని కోరారు.

Similar News

News March 29, 2025

TODAY HEADLINES

image

✒ మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపం.. దాదాపు 180 మంది మృతి
✒ భూకంప ప్రభావిత దేశాలకు అండగా ఉంటాం: మోదీ
✒ కేంద్ర ఉద్యోగులకు 2% DA పెంపు
✒ AP: 31న జరగాల్సిన టెన్త్ పరీక్ష APR 1కి వాయిదా
✒ తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CBN
✒ ఓబుళాపురం మైనింగ్ కేసుపై మే 6న తీర్పు
✒ ఇంటి స్థలం లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: పొంగులేటి
✒ మా శ్రమతోనే BYD రాష్ట్రానికి వచ్చింది: KTR
✒ మే 1 నుంచి ATM ఛార్జీల పెంపు

News March 29, 2025

నోటిఫికేషన్ విడుదల

image

AP: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (PGECET) నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీటెక్/బీఫార్మసీ పాసైన లేదా చివరి ఏడాది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 120 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.

News March 29, 2025

ఆర్సీబీ చేతిలో చెన్నై చిత్తు

image

IPL: సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన బెంగళూరు.. చెన్నైని సునాయాసంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB 20 ఓవర్లలో 196/7 రన్స్ చేసింది. అనంతరం చెన్నై 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 50 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రచిన్ ఒక్కడే 41 పరుగులతో రాణించారు. చివర్లో ధోనీ (30*) రెండు సిక్సర్లు కొట్టి అభిమానుల్లో జోష్ నింపారు.

error: Content is protected !!