News March 25, 2025
27న జగిత్యాల, ధర్మపురిలో పర్యటించనున్న బీసీ కమిషన్

ఈ నెల 27న తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలలో పర్యటిస్తారని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మంగళవారం తెలిపారు. జిల్లాలోని వంశరాజ్, వీరబద్రియ, దొమ్మర కులాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి వస్తున్నారని కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను, వినతులను కమిషన్కు సమర్పించాలని కోరారు.
Similar News
News February 24, 2026
SKLM: ఫిబ్రవరి 25న జాబ్ మేళా..రూ.16-26 వేలతో ఉద్యోగాలు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం వద్ద జాబ్ మేళా జరుగనుందని డీఆర్డీఏ పథకం సంచాలకులు కిరణ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సంస్థలైన డీ-మార్ట్, ఫ్యూషన్ ఫైనాన్స్ల్లో అసోసియేట్ క్యాషియర్, పర్చేజ్, రిలేషన్షిప్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. 19-35ఏళ్లు ఉండాలన్నారు. రూ.16-26 వేలు జీతం ఇవ్వనున్నారు.
News February 24, 2026
బాపట్ల: ఈత పోటీలో గల్లంతైన బాధితుల వివరాలివే.!

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన పీటా. లీలావంశీకృష్ణ మరొకరు బాపట్ల మండలం ముత్తాయపాలెంలోని కనకాద్రినగర్కు చెందిన వేటగిరి చందు. మత్తులో ఈత కొడదాం అంటూ పందెం వేసుకున్నారు. ముందుగా చందు అవతలి ఒడ్డుకు వెళ్లి తిరిగి వస్తుండగా అలల ఉధృతికి అలసిపోయి కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు వంశీ వాగులోకి దూకగా, ఇద్దరూ గల్లంతయ్యారు.
News February 24, 2026
‘యంగ్ అండ్ ఫిట్’గా ఉన్నా.. ఈ క్యాన్సర్లు రావొచ్చు!

వయసుతో సంబంధం లేకుండా యువతలోనూ 6 రకాల క్యాన్సర్లు వేగంగా విస్తరిస్తున్నాయని హార్వర్డ్ స్టడీ హెచ్చరించింది. ముఖ్యంగా కొలొరెక్టల్, సర్వైకల్, క్లోమ, ప్రోస్టేట్, కిడ్నీ క్యాన్సర్లతో పాటు మల్టిపుల్ మైలోమా కేసులు యూత్లో పెరుగుతున్నాయి. ఒబెసిటీ, పొల్యూషన్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం దీనికి కారణాలు. ఆరోగ్యంగా ఉన్నామనే అపోహతో టెస్ట్లు చేయించుకోకపోతే వ్యాధి ముదిరి మరణాల రిస్క్ పెరుగుతోందని తేలింది.


