News March 25, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, బిల్డర్ల ఫోన్లను నిందితులు ట్యాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హవాలా వ్యక్తులను బెదిరించి ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు భారీగా డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారస్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నిందితులు ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బెదిరించినట్లు సమాచారం.
Similar News
News December 31, 2025
HEADLINES

* వైభవంగా వైకుంఠ ఏకాదశి.. కిటకిటలాడిన వెంకన్న ఆలయాలు
* తిరుమల శ్రీవారిని దర్శించుకున్న CM రేవంత్ సహా పలువురు ప్రముఖులు
* పుతిన్ నివాసంపై దాడి వార్తలు.. PM మోదీ తీవ్ర ఆందోళన
* ఏపీలో రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు
* సంక్రాంతికి HYD-VJA మధ్య టోల్ ‘ఫ్రీ’ అమలు చేయాలంటూ గడ్కరీకి కోమటిరెడ్డి లేఖ
* బనకచర్ల కంటే నల్లమలసాగరే డేంజర్: హరీశ్ రావు
* శ్రీలంక ఉమెన్స్తో 5 T20ల సిరీస్ క్లీన్స్వీప్ చేసిన IND
News December 31, 2025
వింటర్లో రాత్రుళ్లు చెమటలా? షుగర్ ముప్పు!

చలికాలంలో కూడా రాత్రుళ్లు చెమటలు పడుతుంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్ వచ్చిందనడానికి అది సంకేతం కావొచ్చని చెబుతున్నారు. ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళుతుండడం, నిద్రపోతున్న సమయంలో చేతులు, కాళ్లు జలదరిస్తాయి. అయితే, విటమిన్ B12, నరాల బలహీనత ఉన్నా ఆ సమస్య రావొచ్చని గుర్తుంచుకోండి. షుగర్ను నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాల సమస్య, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
News December 31, 2025
మోడర్న్ వెపన్స్ కొనుగోలుకు రూ.4,666కోట్ల ఒప్పందాలు

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా రూ.4,666Crతో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్, హెవీ వెయిట్ టార్పడోస్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి ఇవి డిఫెన్స్కు అందనున్నాయి. కాగా 2025-26 వార్షిక ఏడాదిలో రక్షణ రంగానికి కేంద్రం రూ.1,82,492 కోట్లను కేటాయించింది.


