News March 25, 2024
HYD: మల్లారెడ్డి మార్క్ చూయిస్తారా?

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ గెలవదని, అన్నీ BRSయే గెలిచి చూపిస్తామని గతంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి అన్నారు. అన్నట్టుగానే మొత్తం 7 స్థానాల్లో BRSని గెలిపించి చూయించారు. మల్కాజిగిరి గడ్డ BRS అడ్డా అని చెబుతున్న ఆయన.. మరి పార్లమెంట్ ఎన్నికల్లో BRS అభ్యర్థిని గెలిపించి తన మార్క్ చూయిస్తారా లేదా చూడాలి. మీ కామెంట్?
Similar News
News April 19, 2025
HYDలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

సికింద్రాబాద్ రాంగోపాల్పేట్ బాపుబాగ్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కాసమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి, ముఠాలోని అవియాజ్, హుస్సేన్లను అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం HYDకు వచ్చిన అమాయకపు యువతులను స్వప్న అనే మహిళ ఈ కూపంలోకి దించుతోందని గుర్తించారు. ఈ ముఠాలోని లడ్డు, స్వప్న పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
News April 19, 2025
HYDలో తరచూ కనిపిస్తున్న చిరుత

నగరంలోని పలు ప్రాంతాల్లో 2014 నుంచి చిరుతలు కనిపిస్తున్నాయి. మొదటిసారి 2014లో ఇక్రిశాట్లో కనిపించగా జూన్ 2019లో మళ్లీ ఇక్రిశాట్లో కనిపించింది. ఆ తరువాత జనవరి 2020లో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో, డిసెంబర్ 2022లో హెటిరో డ్రగ్స్ ప్లాంట్లో, మే 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ భూముల్లో, జనవరి 2025లో రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో.. ఇపుడు మళ్లీ ఇక్రిశాట్లో చిరుతలు కనిపించాయి.
News April 19, 2025
HYD: ఏడాదికి 2 సార్లు పీహెచ్డీ నోటిఫికేషన్..!

కూకట్పల్లి JNTUH యూనివర్సిటీలో ఇక నుంచి ఏటా 2 సార్లు PhD ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అంతేకాక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు JNTUH అఫిలియేటెడ్ కాలేజీల్లో IIT, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో PhD పూర్తి చేసిన వారిని సెలెక్ట్ చేయనున్నారు.