News March 25, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పారపట్టి పనిచేసిన భద్రాద్రి కలెక్టర్ ✓ జూలూరుపాడు: ట్రాలీ బోల్తా.. పదిమందికి గాయాలు ✓ భద్రాచలం బ్రిడ్జిపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య ✓ కొత్తగూడెంలో న్యాయవాది కార్లకు నిప్పు పెట్టిన దుండగులు ✓ సారపాకలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత ✓ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్ల నిరసన ✓ భద్రాచలం: ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి ✓ పినపాక: స్కూల్లో ఆకతాయిలు నిప్పంటించారు.
Similar News
News March 29, 2025
డేటింగ్ యాప్లో ప్రేమ.. రూ.6.5 కోట్లు పోగొట్టుకున్నాడు

డేటింగ్ యాప్లో పరిచయమైన మహిళను నమ్మి ఓ వ్యక్తి ₹6.5Cr పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్సింగ్ ఓ సంస్థకు డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. భార్యతో విడాకులు కావడంతో ప్రేమ కోసం యాప్లో ప్రయత్నించగా అనిత పరిచయమైంది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులతో డబ్బు సంపాదించొచ్చని నమ్మించింది. తొలుత ₹3.2Lకు గంటల్లోనే ₹24K లాభం చూపింది. దీంతో ₹6.5Cr ఇన్వెస్ట్ చేయగా ముంచేయడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.
News March 29, 2025
శేరి సుభాష్ రెడ్డికి కేటీఆర్, హరీశ్ రావు సన్మానం

శేరి సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, హరీశ్ రావు, మధుసూదనా చారి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా శేరి సేవలు కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్కు శేరి కృతజ్ఞతలు తెలిపారు. మండలి వైస్ ఛైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు కవిత, శంబీపూర్ రాజు, ఎల్. రమణ తదితరులు ఉన్నారు.
News March 29, 2025
VZM: గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పెంపు

గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు గురుకుల జిల్లా కన్వీనర్ కె.రఘునాధ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా గురుకుల పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏప్రిల్ 6 లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.