News March 26, 2025
BREAKING: పంజాబ్ విజయం

గుజరాత్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో పంజాబ్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో GT ప్లేయర్లు తడబడ్డారు. సాయిసుదర్శన్(74), బట్లర్(54), రూథర్ఫోర్డ్ (46) ఫర్వాలేదనిపించినా చివర్లో చేయాల్సిన రన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో GT 20 ఓవర్లలో 232/5 స్కోరుకే పరిమితమైంది.
Similar News
News January 13, 2026
మన ఊరు దగ్గరవుతున్న కొద్దీ ఆ ఫీలింగే వేరు!

సంక్రాంతికి పట్టణాలన్నీ ఖాళీ అవుతుండగా పల్లెలు సందడిగా మారాయి. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు చేరుకోగా, మరికొందరు ప్రయాణాల్లో ఉన్నారు. అయితే మన ఊరు కొద్ది దూరంలో ఉందనగా కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని పలువురు SMలో పోస్టులు పెడుతున్నారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, స్కూల్, చెరువు, పొలాలు తదితరాలు గుర్తుకొస్తాయి. పండగకి ఊరెళ్లేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో.. తిరిగొచ్చేటప్పుడు అంతే బాధగా అన్పిస్తుంది కదా?
News January 13, 2026
ఇరాన్ నిరసనలు.. ఇతడికే తొలి ‘ఉరి’..!

సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే 650మందిని పోలీసులు కిరాతకంగా కాల్చి చంపారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిలో భయం పుట్టించేందుకు నియంతృత్వ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సొల్తానీని రేపు ఉరి తీసేందుకు రంగం సిద్ధంచేసింది. దీంతో మానవహక్కుల ఉద్యమకారులు SMలో అతడికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
News January 13, 2026
పాదాల అందం కోసం

మన శరీరంలోనే భాగమైన పాదాల సంరక్షణను అంతగా పట్టించుకోం. దీని వల్ల మడమలకు పగుళ్లు వచ్చి తీవ్రంగా బాధిస్తాయి కూడా. కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. * పాదాల పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది. * ఓట్మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. వారానికోసారి ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.


