News March 26, 2025
నిమ్మగడ్డి పంట సాగుకు పార్వతీపురం జిల్లా అనుకూలం: కలెక్టర్

మన్యం జిల్లాలో రెండు వేల ఎకరాల్లో నిమ్మగడ్డి పంట సాగు చేసేందుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగింది. తొలి రోజు జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. నిమ్మగడ్డి పంట సాగుకు జిల్లా అనుకూలంగా ఉంటుందన్నారు.
Similar News
News January 26, 2026
భూపాలపల్లి జిల్లాలో 87,134 మంది లబ్ధిదారులు

మహిళా శక్తి ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సమ్మక్క సారక్క మహిళా జిల్లా సమాఖ్యలో 87,134 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజి ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో రూ.240 కోట్లకు పైగా రుణాలు అందించమని. అదే విదంగా మహిళాలకు 1,17,220 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
News January 26, 2026
అలాంటి రేప్ కేసులు చెల్లవు: హైకోర్టు

వెస్ట్రన్ కల్చర్ ప్రభావంతో యువతలో లివ్ ఇన్ రిలేషన్షిప్ ధోరణి పెరిగిందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. బ్రేకప్ తర్వాత మహిళల అత్యాచార ఆరోపణలతో పురుషులపై FIRలు నమోదవుతున్నాయని పేర్కొంది. కిడ్నాప్, రేప్ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి దిగువకోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. బాధితురాలు ఇష్టపూర్వకంగా అతడితో వెళ్లినందున ఆరోపణలు చెల్లవని, పైగా ఆ సమయంలో ఆమె మేజర్ అని స్పష్టం చేసింది.
News January 26, 2026
ASF: ఒకే గ్రామంలో 25 మంది ప్రభుత్వ ఉద్యోగులు

ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తోంది. పెంచికలపేట మండలం ఎల్లూరు గ్రామంలో 25 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. విద్యా శాఖలో 14 మంది, రెవెన్యూ శాఖలో 2, ట్రెజరరీ అండ్ అకౌంట్స్లో 1, ఆర్మీలో 5, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో 1, పోలీస్ శాఖలో 2 ప్రభుత్వ కొలువులు సాధించారు. తమ గ్రామానికి చెందిన 25మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు సన్మానించారు.


