News March 26, 2025
రొంపిచర్ల : విద్యార్థుల నమోదు కోసం పోటా పోటీ ప్రచారం

విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించండంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీచర్లు రొంపిచర్ల మండలంలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. 6 తరగతిలో పిల్లలను నమోదు చేసుకునేందుకు 5 తరగతి చదువుతున్న పిల్లలను కలిసి ప్రభుత్వ స్కూల్లో చేరమని కోరుతున్నారు. మరోపక్క ఏపీ మోడల్ స్కూల్ టీచర్లు కూడా ప్రచారం ముమ్మరం చేస్తూ ఇంటింటికి వెళ్లి పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను టీచర్లు అభ్యర్థిస్తున్నారు.
Similar News
News March 30, 2025
మసీదుల వద్ద పటిష్ఠ భద్రత: చిత్తూరు జిల్లా ఎస్పీ

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తూ ముస్లిం సోదరులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను ప్రేమ, శాంతి, సౌహార్దంతో జరుపుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కోరారు. అనంతరం మసీదుల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.
News March 30, 2025
చిత్తూరు: రేషన్ ఈ-కేవైసీకి గడువు పెంపు

రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచినట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీలోపు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవచ్చని సూచించారు. ఇప్పటి వరకు 17 లక్షల మంది వరకు ఈకేవైసీ చేయించుకున్నారని, ఇంకా చేయించుకోవాల్సిన వారు 1.50 లక్షల మంది మిగిలారని వివరించారు.
News March 30, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇవే

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ మాంసం కిలో. 184, స్కిన్ లెస్ మాంసం కిలో రూ. 210, లేయర్ మాంసం కిలో రూ.145 కు పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. బర్డ్ ప్లూ అనంతరం చికెన్ ధరలలో పెరుగుదల కనబడుతోంది. పండుగల కారణంగా చికెన్ ధరలు పెరిగినట్టు పలువురు తెలుపుతున్నారు. మీ ప్రాంతాలలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.