News March 26, 2025
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు: మంత్రి పొన్నం

వాహనదారులకు మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూర్స్ కచ్చితంగా పటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తామన్నారు. ఆ తర్వాత వాటిని ఏన్నటికీ పునరుద్ధరించమని అన్నారు.
Similar News
News March 29, 2025
సినిమాలు వద్దని నిరాశపరిచారు: జెనీలియా

వివాహం తర్వాత సినిమాల్లో తిరిగి నటిద్దామంటే తెలిసిన వాళ్లు ఎవరూ సహకరించలేదని సినీ నటి జెనీలియా అన్నారు. పదేళ్ల తర్వాత సినిమాలోకి వస్తే ఏమాత్రం వర్కౌట్ కాదు అని నిరాశపరిచారన్నారు. అయినా వారి మాటలు వినకుండా ధైర్యంతో మూవీల్లో తిరిగి నటించానని తెలిపారు. 2022లో జెనీలియా నటించిన ‘వేద్’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో జెనీలియా నటించారు.
News March 29, 2025
శ్రీవారి సేవలో శాసనమండలి ఛైర్మన్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, సిపాయి సుబ్రమణ్యంలతో కలిసి రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి దర్శించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించి, ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
News March 29, 2025
JRG: స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి

జంగారెడ్డిగూడెం (M) కొంగువారిగూడెం కెకెఎం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి చెందారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వంశీ (25), వంశీ కృష్ణ(23) ఇద్దరు యువకులు శనివారం జలాశయం ప్రాంతానికి వెళ్లారు. కాలువలోకి స్నానానికి దిగిన వీరిద్దరూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ధర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.