News March 26, 2025
లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం: MNCL కలెక్టర్

లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. స్కానింగ్ సెంటర్లలో పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలపవద్దని సూచించారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో తగ్గిన బాలికల నిష్పత్తిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 30, 2025
తుళ్లూరు: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం

ఏపీలో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పీ-4 కార్యక్రమం ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. కార్యక్రమంలో దాదాపు 14వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరిగాయి.
News March 30, 2025
ఖమ్మం: 488 కేంద్రాలు.. ఆశలన్నీ బోనస్ పైనే!

ఉమ్మడి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో 2.10 లక్షల ఎకరాల్లో వరికి 344, భద్రాద్రి కొత్తగూడెంలో 65వేల ఎకరాలకు గాను 144 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సీజన్లోనూ సన్నాలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, వానాకాలం బోనస్ కొంతమేర పెండింగ్లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో జమవుతాయని అధికారులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్
News March 30, 2025
ఆహారంలో బొద్దింక, ఎలుక.. 2 వేల శాఖల్ని మూసేసిన హోటల్

జపాన్లో అతి పెద్ద రెస్టారెంట్ చెయిన్గా పేరున్న సూకియా తమకు చెందిన 2వేల హోటల్ శాఖల్ని తాత్కాలికంగా మూసేసింది. ఆహారంలో ఎలుక, బొద్దింక రావడంతో హోటల్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. షేర్ విలువ పతనమైంది. ఈ నేపథ్యంలో సూకియా కస్టమర్స్కు క్షమాపణలు చెప్పింది. అన్ని రెస్టారెంట్లను మూసేసి పూర్తిగా పరిశుభ్రం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా క్లీనింగ్ స్టార్ట్ చేసింది.