News March 26, 2025

కన్నేపల్లిలో ముగ్గురు అరెస్ట్.. ఏడుగురు పరారీ

image

కన్నేపల్లి మండలం ముత్తాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ గంగారాం తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ముగ్గురు జూదరులను అరెస్ట్ చేశామని, మరో ఏడుగురు పారిపోయినట్లు వెల్లడించారు. వారి వద్ద రూ.1500 నగదు, 2ఆటోలు, 2 బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News February 27, 2026

విజయవాడలో ప్రియుడిని పట్టింటిన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌కాల్..!

image

పోలీసుల కళ్లు కప్పి పరారైన నిందితుడిని ఎట్టకేలకు మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్‌లో డ్రగ్స్ తీసుకుంటున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు రాజేష్ పోలీసుల నుంచి పరారయ్యాడు. రాజేష్‌కు గర్ల్ ఫ్రెండ్ ఉండగా ఆమెతో వేరే వారి ఫోన్ నుంచి నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతుండగా సాంకేతిక పరిజ్ఞానంతో అతణ్ని అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు.

News February 27, 2026

DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

<>DRDO<<>>కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలసిస్(ISSA)21 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE/BTech(CS), డిప్లొమా(CS), MSc(మ్యాథ్స్) అర్హతగల వారు దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను hrd.issa@gov.inకు ఈ మెయిల్ చేయాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News February 27, 2026

రూ. 250 కోట్ల భూమి.. సర్కారు నిర్ణయం ఏమిటో?

image

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనంతరం.. స్వాధీనం చేసుకున్న 31.07 ఎకరాల వినియోగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భూమి విలువ సుమారు రూ. 250 కోట్లు ఉంటుందని కలెక్టరే ప్రకటించడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఖరీదైన ఈ భూముల్లో సామాన్యులకు ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాలు లేదా ప్రజా ప్రయోజన నిర్మాణాలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.