News March 26, 2025

NRPT: పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల కారాగార శిక్ష

image

నారాయణపేట మండలానికి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో అత్యాచారం చేసిన ఘటనలో HYD బుద్వేల్ ప్రాంతానికి చెందిన వేముల అభిలాష్ అనే నిందితుడికి 25 ఏళ్ల కారాగార శిక్ష, రూ.60 వేల జరిమానా విధిస్తూ మంగళవారం నారాయణపేట జిల్లా న్యాయమూర్తి అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. 2024 మార్చ్‌ 2న అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు.

Similar News

News January 15, 2026

సంగారెడ్డి: CHICKEN కోసం వెళ్లి మృతి

image

మాంజా తగిలి <<18856381>>వ్యక్తి మృతి<<>> చెందిన సంఘటన సంగారెడ్డిలో బుధవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనుదీప్ (38) వరి కోతలు కోసేందుకు పసల్వాదికి వచ్చాడు. చికెన్ తీసుకురావడానికి సంగారెడ్డికి బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా మాంజా >మెడపై తగిలి మరణించాడు. అనుదీప్ మెడకు తగిలింది చైనా మాంజా కాదని, మామూలుదేనని ఎస్ఐ తెలిపారు.

News January 15, 2026

కృష్ణా: కోడి పందేలలో ఇవే కీలకం?

image

కోడి పందేల విషయంలో వారాలు, రంగులు, దిశలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పందెం రాయుళ్లు విశ్వసిస్తున్నారు. ఆది, మంగళ డేగ, సోమ, శని నెమలి, బుధ, గురువారాల్లో కాకి. ఈ రోజుల్లో ఈ కోళ్లు గెలుపు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే బరిలో కోడిని వదిలే దిశ కూడా కీలకమని చెబుతున్నారు. భోగి నాడు ఉత్తర దిశ, సంక్రాంతికి తూర్పు దిశ, కనుమ నాడు దక్షిణ దిశ నుంచి కోడిని దింపితే విజయం వరిస్తుందని శాస్త్రం చెబుతుందంట.

News January 15, 2026

HYDలో పోగులేస్తే మటన్‌కు ఎంత ఖర్చంటే!

image

సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఇంట్లో తునకలు ఉడకాల్సిందే. మటన్ కిలో రూ.1,000 దాటడంతో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. 5- 6 కుటుంబాలు కలిసి ఓ మేకను కొని మాంసాన్ని కుప్పలుగా విభజించుకుంటున్నారు. దీంతో ఒక్కో ఫ్యామిలీకి రూ.1,400 వరకు ఖర్చైనా 2KG వరకు మటన్ వస్తుండటంతో ఈ విధానానికి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఘట్‌కేసర్, మెట్, IBP తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం పోగుల పంపకాలు జోరుగా సాగుతున్నాయి.