News March 26, 2025
PM కిసాన్ అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ: కేంద్రం

పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిపొందిన అనర్హుల నుంచి ఇప్పటివరకు రూ.416 కోట్లు తిరిగి వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో వెల్లడించారు. ఈ స్కీమ్లో భాగంగా ఇప్పటివరకు 19 విడతల్లో రూ.3.68 కోట్లకు పైగా రైతులకు అందించినట్లు తెలిపారు. ఆధార్, ఐటీ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను ఏరివేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 30, 2025
బైక్ కొంటే రెండు హెల్మెట్లు ఇవ్వాల్సిందే: గడ్కరీ

దేశంలోని అన్ని టూవీలర్ వాహనాలను రెండు ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లతో విక్రయించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. రహదారి భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘ప్రమాదాల్లో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఈ ఆదేశం ఇలాంటి నష్టాలను నివారిస్తుంది. ఈ రూల్ రెగ్యులేషన్ మాత్రమే. ఇది జాతీయ అవసరం కూడా’ అని టీహెచ్ఎంఏ ఛైర్మన్ వ్యాఖ్యానించారు.
News March 30, 2025
రాప్తాడు, కళ్యాణదుర్గం YCP ఇన్ఛార్జులపై కేసు

AP: రాప్తాడు, కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జులు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఉష శ్రీచరణ్లపై పెనుకొండ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 27న పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో వీరిద్దరూ పోలీసులను దూషించి, విధులకు ఆటంకం కలిగించారని, దౌర్జన్యం చేశారని చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు.
News March 30, 2025
మార్చి 30: చరిత్రలో ఈరోజు

1929: భారత్, ఇంగ్లండ్ మధ్య తొలిసారి విమాన సేవలు
1935: రచయిత తంగిరాల వెంకట సుబ్బారావు జననం
1943: గాయకుడు, నటుడు జిత్ మోహన్ మిత్ర జననం
1948: దివంగత నటుడు కన్నడ ప్రభాకర్ జననం
1983: నటుడు నితిన్ జననం
1971: తొలి తెలుగు నటి సురభి కమలాబాయి మరణం
2002: ఆనంద్ బక్షి, సంగీత దర్శకుడు మరణం
2011: నటుడు నూతన్ ప్రసాద్ మరణం
☞ ప్రపంచ ఇడ్లీ దినోత్సవం