News March 26, 2025
ప్రజలకు ప్రభుత్వం ‘ఉగాది కానుక’

TG: రేషన్కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండగ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దీనివల్ల 2.82 కోట్ల మంది ప్రయోజనం చేకూరనుంది. రేషన్ షాపుల్లో ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News March 29, 2025
విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తెచ్చారు. పరిధికి మించి అప్పులు చేస్తే అప్పులూ పుట్టని స్థితికి వస్తారు. AP, TG నేతలు పరిస్థితులను గమనించాలి. విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు’ అని సూచించారు.
News March 29, 2025
2 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి తుమ్మల

TG: రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. మరో రెండు రోజుల్లో దాదాపు 90 శాతం మంది అన్నదాతల అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేయకుండా ఉన్న భూములపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వాటి యజమానులకు మాత్రమే డబ్బులు అందవని పేర్కొన్నారు.
News March 29, 2025
90 శాతం రాయితీ.. 2 రోజులే గడువు

TG: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు రూ.1,010 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు పురపాలక శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి సెలవులు ఉన్నప్పటికీ పన్ను చెల్లించవచ్చని వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీ పొందొచ్చని పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.