News March 26, 2025

‘పవన్ అన్న నువ్వు పిఠాపురం రా..!’

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని పిఠాపురం ప్రజలు ఎంతో ప్రేమతో గెలిపించుకున్నారు. ఆయన వచ్చాక పిఠాపురం దశ దిశ మారతాయని ఎంతో ఆత్రుతగా ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. కానీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నెగ్గిన తర్వాత పవన్ పిఠాపురానికి రావడం చాలా తక్కువే. ఏదో కార్యక్రమంలో ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి, పవన్ అన్న నువ్వు పిఠాపురం రా అని ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారు.

Similar News

News March 31, 2025

అన్యాయాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?: YS జగన్ ఫైర్

image

AP: శ్రీసత్యసాయి(D) రాప్తాడులో YCP కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను మాజీ సీఎం జగన్ ఖండించారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు BC కార్యకర్తను TDP నేతలు పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు కూటమి నేతలతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.

News March 31, 2025

అవనిగడ్డ: హైవేపై రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

image

అవనిగడ్డ మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగడ్డ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తెనాలి వైపు నుంచి మోపిదేవికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అవనిగడ్డ సీఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2025

నిర్మల్‌ జిల్లాలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలోని మామడ మండలం తాండ్ర గ్రామంలో సోమవారం 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధకారులు వెల్లడించారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోత్రత నమోదైందన్నారు. కాగా రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!