News March 26, 2025
ఏలూరు: గోవిందుడిని దర్శించిన గోమాత

నిడమర్రు మండలం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దైవ దర్శనార్థం కోసం ఉదయాన్న వచ్చిన గోమాతను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. నిడమర్రు గ్రామంలో స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. ఈ సంఘటన సోమవారం ఉదయం తెల్లవారుజామున జరిగింది. గోమాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అనంతరం ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి స్వామివారి దర్శించుకుని వెళ్లటం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Similar News
News January 15, 2026
కోవూరు : సంక్రాంతి అంటే మీకు తెలుసా..?

సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అతి పవిత్రమైన రోజు. దీనితో ఉత్తరాయన పుణ్య కాలం ప్రారంభమై పంటకోత ముగిసి ప్రకృతికి, సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఈ పండుగను పెద్ద పండుగ అని అంటారు. దీనిని నువ్వులు, బెల్లంతో చేసే వంటకాలతో, రంగవల్లులతో పెద్దలకు నమస్కరించి కొత్త జీవితాన్ని స్వాగత్తిస్తూ కుటుంబసమేతంగా జరుపుకుంటారు. పండుగ విశిష్టత తెలిసినవారు కామెంట్ చేయండి.
News January 15, 2026
ట్రంప్ ఆదేశిస్తే ఇరాన్పై దాడి ఖాయం!

ఇరాన్పై దాడి చేసే పలు మార్గాలను అమెరికా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే ఏ క్షణమైనా దాడి జరగొచ్చని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాల నుంచి వైమానిక దాడులు, సముద్ర మార్గం ద్వారా క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, సైబర్ వార్, సీక్రెట్ ఆపరేషన్ లేదా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు వంటి ఆప్షన్లు ఉన్నట్లు సమాచారం.
News January 15, 2026
హైదరాబాద్ కెప్టెన్గా మహ్మద్ సిరాజ్

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకండ్ ఫేజ్ మ్యాచ్లకు హైదరాబాద్ కెప్టెన్గా టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 15 మందితో కూడిన టీమ్ను ప్రకటించింది. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్గఢ్తో జరిగే మ్యాచ్లలో సిరాజ్ జట్టును నడిపించనున్నారు. రాహుల్ సింగ్ను VCగా ఎంపిక చేశారు. VHTలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్రావ్ పేరాల సైతం జట్టులో ఉన్నారు.


