News March 25, 2024

HYD: యాక్సిడెంట్.. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దుర్మరణం

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. HYD కుషాయిగూడ ఠాణా ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాలు.. మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన బద్రి శివకోటయ్య(48) మాజీ సైనికోద్యోగి. ఆదివారం ద్విచక్ర వాహనంపై మౌలాలి పరిధి హెచ్‌బీ కాలనీ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది. 

Similar News

News September 8, 2025

RR: పింఛన్‌దారులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్

image

అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి 2 ఏళ్లు కావస్తున్నా పింఛన్ పెంచకుండా మోసం చేస్తున్నట్లు MRPS చీఫ్ మందకృష్ణ మాదిగ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు పింఛన్‌దారులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే పింఛన్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

News September 8, 2025

HYD: 3 లక్షల 3 వేల విగ్రహాల నిమజ్జనం

image

గణేష్ నిమజ్జనం విజయవంతంగా జరిగిందని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల 3 వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు GHMC, పోలీసు, విద్యుత్, హెచ్ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, విద్యుత్, పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.

News September 7, 2025

రంగారెడ్డి: నిరుద్యోగులకు శుభవార్త

image

నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మ. 2.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాధికారి జయశ్రీ తెలిపారు. విద్యార్హత 10th, ఇంటర్, డిగ్రీ, PG, ITI డిప్లమా. వయస్సు: 18-30 మధ్య ఉండాలి. మరిన్ని వివరాలకు 9063099306, 8977175394 నంబర్లను సంప్రదించాలన్నారు.