News March 26, 2025

చౌటుప్పల్: ఆల్ ఇండియా సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపిక

image

చౌటుప్పల్‌కు చెందిన రమావత్ సరిత అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ తరఫున ఎంపికయ్యారు. B.P.Ed మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె 3వ బేస్ ప్లేయర్‌గా తన స్థానం దక్కించుకున్నారు. ఏప్రిల్‌లో నెల్లూరులో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల క్రీడాకారులు పోటీపడనున్నారు.

Similar News

News July 9, 2025

ADBలో పర్యటించిన రీజినల్ జాయింట్ డైరెక్టర్

image

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీలక్ష్మి బాయి బుధవారం ADB జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అంగన్వాడీ కేంద్రాలను, సఖీ కేంద్రం, బాలరక్షక్ భవన్, శిశుగృహను ఆమె సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం సీడీపీఓలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు సఖి కేంద్రంలో మొక్కలు నాటారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా ఉన్నారు.

News July 9, 2025

ADB: ‘సాంకేతిక పద్ధతులతో అధిక దిగుబడులు’

image

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోరమండల్ కంపెనీ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. నానో ఎరువులు మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాక, పంట దిగుబడుల పెంచుతాయని చెప్పారు. రైతులు సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు.

News July 9, 2025

మార్కెట్‌లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్.. అదేంటంటే?

image

మీకు పెళ్లిళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడమంటే ఇష్టమా? అయితే తెలియని వారి పెళ్లిలో కొత్తవారితో సరదాగా గడిపే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా నగరాల్లో ‘ఫేక్ వెడ్డింగ్’ ట్రెండ్ నడుస్తోంది. నిర్వాహకులు ఏర్పాటు చేసే ఈ ఫేక్ పెళ్లిలో వధువు, వరుడు ఉండరు. కానీ, అన్ని వేడుకలు, వివాహ భోజనం, బరాత్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో రూ.1499 చెల్లించి టికెట్ కొనొచ్చు. ఈ ట్రెండ్ గురించి చర్చ జరుగుతోంది.