News March 26, 2025
అత్యధిక ఫిర్యాదులు.. మూడో స్థానంలో అనకాపల్లి జిల్లా

సమస్యలపై అనకాపల్లి జిల్లా నుంచే అత్యధిక ఫిర్యాదులు అందినట్లు వెల్లడయ్యింది. CM చంద్రబాబుతో నిన్న జరిగిన సమావేశంలో CS విజయానంద్ పేర్కొన్నారు. గత జూన్ 15 నుంచి ఈ మార్చ్ 19 వరకు జిల్లాలో 45,884 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. అందులో రెవెన్యూకు రిలేటెడ్ కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కాగా.. ఎక్కువ ఫిర్యాదులు అందిన జిల్లాల్లో రాష్ట్రంలోనే అనకాపల్లి మూడో స్థానంలో ఉంది.
Similar News
News March 29, 2025
IPL: మరోసారి ముంబై టీంలో కాకినాడ కుర్రాడికి చోటు

IPLలో నేడు MI vs GT మ్యాచ్ మరికాసేపట్లో జరుగనుంది. కాకినాడకు చెందిన క్రికెటర్ పీవీ సత్యనారాయణరాజు మరోసారి జాక్ పాట్ కొట్టాడు. అతడికి మరోసారి MI అవకాశం కల్పించింది. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో MI తరఫున తుది జట్టులో అవకాశం లభించింది. ఈ మ్యాచ్లో సత్యనారాయణ రాజు అద్భుతంగా రాణించాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.
*ALL THE BEST సత్యనారాయణ రాజు*
News March 29, 2025
విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తెచ్చారు. పరిధికి మించి అప్పులు చేస్తే అప్పులూ పుట్టని స్థితికి వస్తారు. AP, TG నేతలు పరిస్థితులను గమనించాలి. విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు’ అని సూచించారు.
News March 29, 2025
2 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి తుమ్మల

TG: రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. మరో రెండు రోజుల్లో దాదాపు 90 శాతం మంది అన్నదాతల అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేయకుండా ఉన్న భూములపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వాటి యజమానులకు మాత్రమే డబ్బులు అందవని పేర్కొన్నారు.