News March 26, 2025

చిన్న మేరంగి జంక్షన్ వద్ద ఏనుగుల బీభత్సం

image

పార్వతీపురం మన్యం జిల్లా జీఎంవలస చిన్నమేరంగి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిన్న మేరంగి జంక్షన్ కూరగాయల మార్కెట్‌ ఉన్న షాపులు గజరాజులు ధ్వంసం చేశాయి. కూరగాయలన్నీ నేలమట్టం అవడంతో షాపు యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు. ధ్వంసమైన షాపులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Similar News

News March 29, 2025

2 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి తుమ్మల

image

TG: రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. మరో రెండు రోజుల్లో దాదాపు 90 శాతం మంది అన్నదాతల అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేయకుండా ఉన్న భూములపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వాటి యజమానులకు మాత్రమే డబ్బులు అందవని పేర్కొన్నారు.

News March 29, 2025

90 శాతం రాయితీ.. 2 రోజులే గడువు

image

TG: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు రూ.1,010 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు పురపాలక శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి సెలవులు ఉన్నప్పటికీ పన్ను చెల్లించవచ్చని వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీ పొందొచ్చని పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.

News March 29, 2025

రుద్రవరంలో మరోసారి భానుడి విశ్వరూపం.!

image

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం శనివారం నంద్యాల(D) రుద్రవరంలో రాష్ట్రంలోనే 43.5°C, కర్నూలు(D) ఉలిందకొండలో 42.4°C ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, గత కొద్దిరోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

error: Content is protected !!