News March 26, 2025

రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి..సౌత్‌లో ఫస్ట్ టైమ్

image

TG: నిమ్స్ ఆసుపత్రిలో 33ఏళ్ల యువకుడికి రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేశారు. దీంతో దక్షిణాదిలో రోబోటిక్ విధానంలో ఆపరేషన్ చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్ ఘనత సాధించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించిన డాక్టర్లు ఆ యువకుడికి విజయవంతంగా అమర్చారు. నిమ్స్‌లో ఇప్పటివరకూ 2వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ పూర్తిచేసినట్లు డాక్టర్లు తెలిపారు.

Similar News

News November 3, 2025

శివలింగానికి కుంకుమ పెడుతున్నారా..?

image

శివలింగానికి చాలామంది భక్తులు కుంకుమ పెడుతుంటారు. కానీ అలా పెట్టడం శాస్త్ర సమ్మతం కాదని పండితులు చెబుతున్నారు. శివలింగానికి విభూది, గంధం మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. ‘పరమశివుడు గాఢమైన ధ్యానంలో ఉంటారు. ఎరుపు రంగులో ఉండే కుంకుమ వేడిని పెంచుతుంది. అందుకే ఆయన శరీరానికి చల్లదనాన్ని, ప్రశాంతతను ఇచ్చే చందనాన్ని మాత్రమే సమర్పించాలి. శివారాధనలో కుంకుమకు బదులు గంధం వాడటం అత్యంత ముఖ్యం’ అంటున్నారు.

News November 3, 2025

మిడ్‌నైట్ క్రేవింగ్స్‌కి కారణం ఇదే..

image

కడుపునిండా తిన్నా కొందరికి అర్ధరాత్రిళ్లు ఆకలివేస్తూ ఉంటుంది. సరిగా నిద్రపట్టక దొరికిన స్నాక్స్ తినేస్తారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. గ్రెలిన్ హార్మోన్ పెరగడం, ఒత్తిడి, డైటింగ్, కొన్నిరకాల మందులు వాడటం వల్ల క్రేవింగ్స్ వస్తాయి. డిన్నర్‌లో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే క్రేవింగ్స్ తగ్గుతాయి. లేదంటే డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

News November 3, 2025

ఉపగ్రహాలతో గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించొచ్చు: మస్క్

image

వాతావరణ మార్పులపై ఆందోళన పెరుగుతున్న వేళ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఏఐ‌తో నడిచే భారీ ఉపగ్రహాల సముదాయంతో గ్లోబల్ వార్మింగ్‌ను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భూమిని చేరే సౌర శక్తి మొత్తంలో చిన్న సర్దుబాట్లు చేయడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించవచ్చని మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు. సహజ పరిణామాన్ని నిరోధిస్తే ముప్పు తప్పదని కొందరు ఆయనకు కౌంటర్ వేస్తున్నారు.