News March 26, 2025
నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం పాత ఆజంజాహీ మిల్ గ్రౌండ్లో 16.7 ఎకరాలలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న జీ ప్లస్ టూ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు బ్లూ ప్రింట్ మ్యాప్ ప్రకారం పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 1, 2025
మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించిన వరంగల్ కలెక్టర్

నర్సంపేటలోని ద్వారకా పేటలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల(బాలికలు)ను కలెక్టర్ సత్యశారద సోమవారం సందర్శించారు. పదవతరగతి విద్యార్థులతో ముచ్చటించారు. పదవతరగతి విద్యార్థినులకు బంగారు భవిష్యత్కి టర్నింగ్ పాయింట్ అని విద్యార్థులకు సూచించారు. అనంతరం స్టోర్ రూమ్, కిచెన్ రూమ్ను సందర్శించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని వార్డెన్ను కలెక్టర్ ఆదేశించారు.
News March 31, 2025
హన్మకొండ: GREAT.. గ్రూప్-1 అధికారిగా ఎంపికైన సోని

హనుమకొండ టైలర్స్ స్ట్రీట్కు చెందిన తోట దామోదర్-జ్యోతిల కుమార్తె తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల జాబితాలో తోట సోనికి రాష్ట్ర స్థాయిలో 203వ ర్యాంకు, మల్టీ జోన్ స్థాయిలో 93వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించానని తోట సోని తెలిపారు.
News March 31, 2025
వరంగల్: జాతరలో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో నిర్వహించిన గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో కుంతపల్లి గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగెం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణలో పాల్గొన్న యువకుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.